Home> అంతర్జాతీయం
Advertisement

న్యూయార్క్ ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోడీ

న్యూయార్క్ ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోడీ

అమెరికాలోని న్యూయార్క్‌లో బుధవారం జరిగిన ఉగ్రదాడిలో  8 మంది ప్రాణాలు కొల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిని భారత్‌తో సహా ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందిస్తూ న్యూయార్క్ లో ఉగ్రదాడి జరగడం బాధాకరమన్నారు. ఈ దాడిలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ట్విటర్ వేదికగా మోడీ స్పందిస్తూ.. ‘‘న్యూయార్క్ నగరంపై ఉగ్రదాడికి తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను...’’ అని పేర్కొన్నారు.

 

Read More