Videos

RTC BUS FAIL : సాంకేతిక సమస్యతో ఆగిపోయిన ఆర్టీసీ బస్సు..ప్రయాణికుల పరేషాన్

RTC BUS FAIL :  శంషాబాద్ ఎయిర్‌ పోర్టుకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు రహదారి మధ్యలో ఆగిపోవడం తో ఇతర దేశాలకు వెళ్లేందుకు విమాన టికెట్లు కొనుకున్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జగిత్యాల డిపో కు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఇవాళ తెల్లవారుజామున వెళ్లాల్సి ఉంది. అయితే బస్సులో గేర్  లింక్ పోవడం వల్ల పెగడపల్లి మండలం అరవెల్లి గ్రామంలో బస్సు  అగిపోయింది.దీంతో గంటల తరబడి రోడ్డు పై ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More