Videos

BANDI SANJAY: యాదాద్రిలో పచ్చి బట్టలతో బండి సంజయ్ ప్రమాణం

BANDI SANJAY: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో సంబంధంలేదని బండి సంజయ్‌.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేశారు. సీఎం కేసీఆర్‌ కూడా ఇదే విధంగా ప్రమాణం చేయాలని కోరారు. 100 కోట్లు డబ్బు అన్నారు..డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను బయటకు ఎందుకు రానివ్వడం లేదని అన్నారు. ఆధారాలు లేవు కాబట్టి కోర్టు రిమాండ్‌కు కూడా ఇవ్వలేదని తెలిపారు. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ బీజేపీ ప్రతిష్ట దిగదార్చే ప్రయత్నం చేశారన్నారు. తెలంగాణ ప్రజలు తలదించుకునేలా సీఎం కేసీఆర్‌  ప్రవర్తిస్తున్నారని అన్నారు.

 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More