Home> తెలంగాణ
Advertisement

YS Sharmila slams KCR: పూర్తి కాని ప్రాజెక్టుకు పూజలా ? కేసీఆర్‌పై షర్మిల సెటైర్లు

YS Sharmila slams CM KCR: పనులు ఆగిపోయి పడావుపడ్డ ప్రాజెక్టును.. ఎన్నికల కోసం నామమాత్ర పనులు చేపట్టి, ప్రాజెక్టు మొత్తం పూర్తయిందనేలా పాలమూరు, రంగారెడ్డి ప్రజలను భ్రమలకు గురయ్యేలా చేస్తున్నాడు అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు.

YS Sharmila slams KCR: పూర్తి కాని ప్రాజెక్టుకు పూజలా ? కేసీఆర్‌పై షర్మిల సెటైర్లు

YS Sharmila slams CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ఓట్లు దక్కించుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి మండిపడ్డారు. సగం పనులు కూడా కాని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవాలు చేయడం ఏంటి ? అసలు పూర్తే కాని రిజర్వాయర్లకు పూజలు చేయడం ఏంటి అని షర్మిల సీఎం కేసీఆర్ ని నిలదీశారు. ఎన్నికల వేళ.. పిట్టల దొర వింతలు అన్నీఇన్నీ కావు అంటూ పరోక్షంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఎద్దేవా చేశారు.  

కాలువలు తవ్వకుండానే ఊరూరా ఉత్సవాలట ! స్వరాష్ట్రంలో ప్రారంభించిన తొలి ప్రాజెక్టు పాలమూరు – రంగారెడ్డిని కేసీఆర్ సర్వనాశనం చేశాడు. రీ డిజైన్ పేరిట తీరని అన్యాయం చేశాడు. కమీషన్లు ఇచ్చే కాళేశ్వరంలో లక్ష కోట్లు కుమ్మరించి, పాలమూరుకు శఠగోపం పెట్టాడు. పనులు ఆగిపోయి పడావుపడ్డ ప్రాజెక్టును.. ఎన్నికల కోసం నామమాత్ర పనులు చేపట్టి, ప్రాజెక్టు మొత్తం పూర్తయిందనేలా పాలమూరు, రంగారెడ్డి ప్రజలను భ్రమలకు గురయ్యేలా చేస్తున్నాడు అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు.

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదు. ప్రాజెక్టు పరిధిలో ఉన్న 4 రిజర్వాయర్లలో తట్టెడు మట్టీ తీయలేదు. లక్ష్మీదేవిపల్లి 6వ రిజర్వాయర్ అతి గతి లేదు. కేవలం అంజనాపూర్ మొదటి రిజర్వాయర్‌లో 90 శాతం పనులే పూర్తి చేసి ప్రాజెక్ట్ మొత్తం కట్టినట్లు కలరింగ్ ఇస్తున్నారు. నార్లాపూర్ వద్ద 9 మోటార్లకు గాను ఒక్కటే వాడుకలోకి తెచ్చారు. స్థానిక భూనిర్వాసితులకు అణాపైసా సాయం అందలేదు. కాలువలకు భూసేకరణ కూడా పూర్తి కాలేదు. ఇదీ పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చిత్తశుద్ధి అని చెబుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ఎండగట్టే ప్రయత్నం చేశారు.

గీసింత పనితనానికి గ్రామాల్లో సంబురాలు చేయాలట! కృష్ణా జలాలు ఊరూరా చల్లాలట. తొమ్మిదేండ్లుగా పాలమూరు ప్రజలను మోసం చేసినందుకు నీ ప్రభుత్వానికి చేయాల్సింది విజయయాత్ర కాదు. పాడెయాత్ర చేయాలి అని షర్మిల మండిపడ్డారు. పాలమూరు పల్లెల్లో చేయాల్సింది సంబురాలు కాదు. మీ బందిపోట్లకు బడితే పూజలు చేయాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానేత రాజశేఖర్ రెడ్డి 35 వేల కోట్లతో పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టును కేసీఆర్ కమీషన్ల కోసం రూ.55 వేల కోట్లకు పెంచినా పూర్తి చేయలేకపోయాడు. ఇది పూర్తిగా ఎన్నికల స్టంటే కానీ పాలమూరు ప్రజల మీద ప్రేమ మాత్రం కానే కాదు. దక్షిణ తెలంగాణలో డిపాజిట్లు దక్కవన్న సర్వేలతో దొరకు పట్టుకున్న భయం తప్ప.. నీళ్లు ఇవ్వాలన్న సోయి లేదు అని సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల మండిపడ్డారు.

Read More