Home> తెలంగాణ
Advertisement

కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

అతివేగం ఓ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది.

కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురువారం ఉదయం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులో ముందు వెళ్తున్న లారీని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది.

See Pics: ప్రేయసితో మాక్స్‌వెల్ చెట్టాపట్టాల్.. ఫొటోలు వైరల్

Also Read: తల్లా.. పెళ్లామా.. తేల్చుకోండి: అనసూయ

fallbacks

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారథి ఘటనా స్థలానికి చేకుకుని పరిశీలించారు. మృతులు మంచిర్యాల జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. మృతులలో ప్రణయ్ కుమార్ వేముల ఐడీ కార్డు లభించింది. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More