Home> తెలంగాణ
Advertisement

ఆ ఇల్లే ఆమెకు కారాగారం

  

ఆ ఇల్లే ఆమెకు కారాగారం

తెలంగాణలోని జగిత్యాల ప్రాంతంలో ఓ పాతిక సంవత్సరాల యువతిని ఒక ఇంటిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను విడిపించారు. గీత అనే  యువతిని ఆమె సొంత అన్నదమ్ములు, వదినలే గొలుసులతో కట్టేసి, తమ ఇంటిలో ఓ గదిలో బంధించి హింసించడం గమనార్హం. ఈ విషయమై స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. అప్పుడప్పుడు ఆ ఇంటిలో నుండి వచ్చే అరుపులు, కేకలు విని స్థానికులు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆ యువతి గతంలో అదే ఊరులో బిఏ వరకు చదివి ఉపాధ్యాయినీగా ఉద్యోగం చేసేదని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆమె కుటుంబీకులు చెబుతున్న కథనం మరోలా ఉంది. ఆమెకు గత 11 సంవత్సరాలుగా మతి స్థిమితం లేదని.. తమపై దాడి చేయడంతో గొలుసులతో కట్టి గదిలో బంధించినట్లు వారు తెలిపారు. అలాగే ఆమె చికిత్స కోసం దాదాపు 11 లక్షలు ఖర్చు పెట్టినట్లు మెడికల్ బిల్లులు కూడా చూపించారు. అయితే నిజనిజాలు తెలుసుకోవడానికి జగిత్యాల పోలీసులు దర్యాప్తును చేపట్టారు. 

Read More