Home> తెలంగాణ
Advertisement

Telangana Corona Cases: తెలంగాణలో 5 వేలు దాటిన కరోనా కేసులు, ఏకంగా 15 మరణాలు

Telangana Reports 3,840 New COVID-19 Positive Cases And Nine Deaths: ఏప్రిల్ ప్రారంభంలో వెయ్యి నమోదయ్యే కరోనా కేసులు నేడు 5 వేలు దాటిపోయాయి. తెలంగాణలో తాజాగా 5,093 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Telangana Corona Cases: తెలంగాణలో 5 వేలు దాటిన కరోనా కేసులు, ఏకంగా 15 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ ప్రారంభంలో వెయ్యి నమోదయ్యే కరోనా కేసులు నేడు 5 వేలు దాటిపోయాయి. తెలంగాణలో తాజాగా 5,093 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,51,424కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1,29,637 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 5 వేల 93 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 51 వేల 4 వందల 24కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ రాష్ట్రంలో మరో 15 మంది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా వైరస్(CoronaVirus) మరణాల సంఖ్య 1,824కి చేరింది. గత నెలలో ప్రతిరోజూ నమోదయ్యేు రెండు, మూడు కరోనా మరణాలు ప్రస్తుతం 10కి పైగా నమోదు కావడం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

Also Read: COVID-19: కరోనా వైరస్ ఎంత సమయంలో వ్యాపిస్తుందో తెలుసా, నిపుణులు ఏం చెప్పారంటే

పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కోవిడ్19(COVID-19) నిబంధనలు కఠినతరం చేసింది. మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న వారికి రూ.1000 జరిమానా విధిస్తున్నా ప్రయోజనం లేకపోయింది. కరోనా కేసులను అదుపు చేయడం సాధ్యం కావడం లేదు. శనివారం ఒక్కరోజు రాష్ట్రంలో చికిత్స అనంతరం కోవిడ్-19 నుంచి 1,555 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,12,563 మంది కరోనా మహమ్మారిని జయించారు. 

Also Read: Face Mask Mistakes: ముఖానికి మాస్క్ ధరిస్తున్నారా, అయితే ఈ పొరపాట్లు మాత్రం చేయవద్దు

తెలంగాణలో అత్యధిక కోవిడ్-19 పాజిటివ్ కేసులు  జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా 743 కరోనా కేసులు జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో నిర్ధారణ కావడం హైదరాబాద్ నగర వాసులను భయాందోళనకు గురిచేస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం 37 వేల 37 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం క్వారంటైన్‌లో 24,156 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ 1,17,37,753 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More