Home> తెలంగాణ
Advertisement

COVID-19 Positive Cases: తెలంగాణలో కోవిడ్19 కలకలం, తాజాగా 2 వేల చేరువలో పాజిటివ్ కేసులు

COVID-19 Positive Cases Telangana: గత నెలలో కేవలం కొన్ని రాష్ట్రాల్లో తీవ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారి ఏప్రిల్ నెలలో దేశంలో పలు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది.  గత కొన్ని రోజులు కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో 2000కు చేరువలో కేసులు నమోదయ్యాయి.

COVID-19 Positive Cases: తెలంగాణలో కోవిడ్19 కలకలం, తాజాగా 2 వేల చేరువలో పాజిటివ్ కేసులు

COVID-19 Positive Cases Telangana : తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశలో పెను ప్రభావాన్ని చూపుతోంది. గత నెలలో కేవలం కొన్ని రాష్ట్రాల్లో తీవ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారి ఏప్రిల్ నెలలో దేశంలో పలు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది.  గత కొన్ని రోజులు కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో 2000కు చేరువలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తాజాగా 1,914 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,649కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

తెలంగాణలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు గత 24 గంటల్లో 74,274 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో వెయ్యి తొమ్మిది వందల పద్నాలుగు మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి తెలంగాణ(Telangana)లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 16 వేల 6 వందల నలబై తొమ్మిదికి చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న మరో అయిదుగురు చనిపోయారు.  తాజా మరణాలతో కలిపితే తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,734కి చేరింది.

Also Read: CoronaVirus Cases In India: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడానికి కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి

దేశంలో ఎన్నడూ లేని విధంగా నిన్న తొలిసారిగా లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కోలుకున్న వారి సంఖ్య కన్నా మూడు, నాలుగు రెట్లు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజు రాష్ట్రంలో చికిత్స అనంతరం కోవిడ్-19(COVID-19) నుంచి 285 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,03,298 మంది కరోనా మహమ్మారిని జయించారు. 

Also Read: Vitamin C Uses: వేసవిలో మీ ఆరోగ్యానికి విటమిన్ సి కీలకం, దాని వల్ల ప్రయోజనాలు మీకోసం

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత అధికం అవుతుంది. తాజా కోవిడ్-19 పాజిటివ్ కేసులలో అధికంగా జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోనే ఏకంగా 393 కరోనా కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో కరోనా సెకండ్ సేవ్ కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్కులు లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తూ కోవిడ్-19 నిబంధనలు కఠినతరం చేసింది. తెలంగాణలో ప్రస్తుతం 11,617 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 6,634 మంది చికిత్స పొందుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More