Home> తెలంగాణ
Advertisement

తెలంగాణ నూతన డీజీపీగా మహేందర్ రెడ్డి

  

తెలంగాణ నూతన డీజీపీగా మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా ఎం. మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ పదవీ విరమణ చెందుతున్న సందర్భంలో ఆయన నుండి బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందే అనురాగ్ శర్మ వీడ్కోలు సభలో మహేందర్‌రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థను ఆధునీకరించిన ఘనత అనురాగ్‌శర్మకు దక్కిందని తెలిపారు. తెలంగాణ పోలీస్‌ను దేశంలోనే గొప్ప పోలీస్ వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదని కొనియాడారు. డీజీపీగా పదవీవిరమణ చేసిన అనురాగ్ శర్మ ప్రస్తుతం పోలీస్, లా అండ్ ఆర్డర్, క్రైమ్ కంట్రోల్ విభాగాల్లో ప్రభుత్వ సలహాదారుగా ఉండనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు అందించింది. 

Read More