Home> తెలంగాణ
Advertisement

ఆర్టీసీ కార్మికులను తప్పుపట్టిన మంత్రి జగదీశ్‌ రెడ్డి

ఆర్టీసీ కార్మికులను తప్పుపట్టిన మంత్రి జగదీశ్‌ రెడ్డి

ఆర్టీసీ కార్మికులను తప్పుపట్టిన మంత్రి జగదీశ్‌ రెడ్డి

సూర్యాపేట: ఆర్టీసీ కార్మికులు పొరపాటు చేశారని చెబుతూ కార్మికులను మంత్రి జగదీశ్‌ రెడ్డి తప్పుపట్టారు. సమయం కాని సమయంలో సమ్మె చేయడం వల్ల కార్మికులే ప్రజల మద్దతు కోల్పోయారన్నారు. గురువారం హుజూర్‌నగర్‌లో జరగనున్న సీఎం కేసీఆర్ ప్రచార సభలో అసలు ఆర్టీసీ ప్రస్తావనే ఉండదని మంత్రి జగదీష్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. 

ఈ సందర్భంగా బీజేపి, కాంగ్రెస్‌లపై విమర్శలు ఎక్కుపెట్టిన మంత్రి జగదీష్ రెడ్డి.. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌, బీజేపీ ఏకమయ్యాయని విమర్శించారు. ప్రతీ రోజు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, లక్ష్మణ్‌ మాట్లాడుకుంటున్నారని, ఉత్తమ్‌ ఫిర్యాదుల కాపీలన్నీ లక్ష్మణ్‌కు చేరుతున్నాయని జగదీశ్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

Read More