తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. నిత్యం కోవిడ్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. శనివారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 2,216 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,57,096కు చేరింది. తాజాగా 56,217 శాంపిల్స్కు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు.
శనివారం ఒక్కరోజే 11 మంది కరోనాతో పోరాడుతూ మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 961కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 2,603 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా టెస్టులు 21,34,912 (21.34 లక్షలు) అని బులెటిన్లో పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 1,24,528కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఫొటో గ్యాలరీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR