Home> తెలంగాణ
Advertisement

తెలంగాణ ప్రజలకు గవర్నర్, కేసీఆర్ శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు గవర్నర్, కేసీఆర్ శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు గవర్నర్, కేసీఆర్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి గెలుపునకు దీపావళి పర్వదినం ఎల్లప్పుడూ ఓ ప్రతీకగా నిలుస్తుందని శాంతికి, మత సామరస్యానికి, సమసమాజ నిర్మాణానికి దీపావళి ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. 

మరోవైపు రాష్ట్ర ప్రజలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, ఈ దీపావళి వారి జీవితాల్లో కోటి కాంతులు వెదజల్లాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

Read More