Home> తెలంగాణ
Advertisement

Kishan Reddy: ఆ ఘనత ప్రధాని మోదీదే.. వరంగల్‌కు ఎయిర్‌ పోర్టు తీసుకువస్తాం: కిషన్ రెడ్డి

PM Modi Visit To Warangal: వరంగల్​ నుంచి హైదరాబాద్​ వరకు సిమెంట్​ రోడ్డు వేయించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే వరంగల్ ఎయిర్ పోర్ట్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. వరంగల్ ప్రజలు మోదీ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. 
 

Kishan Reddy: ఆ ఘనత ప్రధాని మోదీదే.. వరంగల్‌కు ఎయిర్‌ పోర్టు తీసుకువస్తాం: కిషన్ రెడ్డి

PM Modi Visit To Warangal: ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్​ సభను సక్సెస్​ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం  భారీ కాన్వాయ్‌​తో హైదరాబాద్​ నుంచి వరంగల్ చేరుకున్న ఆయన.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రధాని సభ జరిగే ఆర్ట్స్​ కాలేజీ గ్రౌండ్​లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో  మాట్లాడుతూ.. ప్రధాని టూర్ షెడ్యూల్‌ను వివరించారు. 

==> రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్​ యూనిట్​, జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రధాని భూమి పూజ చేస్తారు.
==> తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నది.
==> తెలంగాణలో కేసీఆర్​ కుటుంబం ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తున్నాం.
==> కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్‌​హౌజ్‌​కు పరిమితం చేయాలి.
==> రాష్ట్ర అభివృద్ధి కోసం ఈసారీ బీజేపీని ఆశీర్వదించాలని ప్రధాని మోదీ కోరనున్నారు.
==> మంత్రులు,ముఖ్యమంత్రి సచివాలయంకు పోయే పరిపాలన కావాలి.
==> బీఆర్​ఎస్​, బీజేపీ ఎప్పుడూ కలిసిన దాఖలాలు లేవు.. ఇతర పార్టీలు చేసే విషప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు
==> కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ గతంలో అనేకసార్లు కలిశాయి. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో కాంగ్రెస్​ పార్టీకి మద్దతుగా కేసీఆర్​ మాట్లాడిన విషయం గుర్తుంచుకోవాలి. అవి రెండు బొమ్మ బొరుసు పార్టీలు.
==> గతంలో 18 చోట్ల కాంగ్రెస్ గెలిస్తే.. 12 మంది బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు.
==> బీజేపీ మాత్రమే కుటుంబపాలనను అంతమొందించగలదు
==> బీజేపీ మాత్రమే న్యాయమైన పాలన చేయగలదు.
==> గత 9 ఏండ్లుగా మోదీ ప్రభుత్వం నీతిమంతంగా పనిచేస్తున్నది.
==> మంచి ప్రభుత్వం తెలంగాణకు అందిస్తాం.
==> చాలా ఏండ్ల తర్వాత భారత ప్రధానిగా మోదీ వరంగల్‌​కు వస్తున్నారు.
==> వరంగల్​ నుంచి హైదరాబాద్​ వరకు సిమెంట్​ రోడ్డు వేయించిన ఘనత ప్రధాని మోదీది.
==> వరంగల్​ జిల్లాకు టెక్స్‌​టైల్​ పార్క్​ కేంద్రమే మంజూరు చేసింది.
==> వరంగల్​ అభివృద్ధి విషయంలో మోడీ ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నది.
==> రైలు మ్యానుఫ్యాక్చరింగ్​ పరిశ్రమలో భవిష్యత్‌లో రైలు ఇంజన్​ సహా.. వ్యాగన్లు, కోచ్​లు ఏమైనా తయారు చేసుకోవచ్చు.
==> అనుకున్నదానికంటే పెద్ద పరిశ్రమనే కాజిపేటకు వచ్చింది.
==> బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్​ ఎయిర్‌​పోర్టు అంశం మొదటి
==> కవిత అరెస్ట్ చూడాల్సిన పని బీజేపీది కాదు. సీబీఐ పని అది.
==> కేసీఆర్‌ది కమీషన్ల ప్రభుత్వం..
==> కుటుంబ వాటాలు, పెత్తనం లేని పరిపాలన తెలంగాణలో తీసుకువస్తాం.
==> మామునూర్ ఎయిర్ పోర్ట్ స్థలం విషయంలో నేను, మా అధికారులు రాష్ట్రానికి ఎన్నోసార్లు లెటర్స్ రాశాం. 
==> తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే వరంగల్ ఎయిర్ పోర్ట్‌కు మొదటి ప్రాధాన్యత. 
==> ఎయిర్ జర్నీని బీజేపీ ప్రోత్సాహిస్తుంది.
==> ఓరుగల్లు ప్రజలు మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.
==> స్మార్ట్ సిటీ, అమృత్ వంటి స్కీమ్స్ ఇచ్చాం. పీఎం మిత్ర ద్వారా మెగా టెక్స్ టైల్ పార్క్‌కు కేంద్రం నిధులు
==> రూ.550 కోట్లతో జాతీయ రహదారి అనుసంధానం
==> మెగా టెక్స్ టైల్ పార్క్ రావడానికి స్టేట్ తరఫున కృషి చేశాను

Also Read: Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి భారీ షాక్.. పిటిషన్‌ కొట్టివేసి గుజరాత్ హైకోర్టు    

Also Read: Minister KTR: ప్రధాని మోదీ వరంగల్‌ టూర్‌ను బహిష్కరిస్తున్నాం.. ఏం మొహం పెట్టుకుని వస్తున్నారు: కేటీఆర్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More