Home> తెలంగాణ
Advertisement

TS Assembly Elections 2023 Voting Updates: తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్, ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు

TS Assembly Elections 2023 Voting Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది తొలుత మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3.26 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం నుంచే కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. 

TS Assembly Elections 2023 Voting Updates: తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్, ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు

TS Assembly Elections 2023 Voting Updates: తెలంగాణలోని 119 నియోజకవర్గాల పోలింగ్ ప్రారంభమైంది. 13 నియోజకవర్గాలు మినహా మిగిలినవాటిలో యధావిధిగా ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం గంట ముందే పోలింగ్ పూర్తి కానుంది. 

తెలంగాణలోని 119 నియోజకవర్గాల పోలింగ్‌కు మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటిలో సమస్యాత్మకంగా భావించిన 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3.26 కోట్లమంది ఓటర్లుంటే అందులో పురుషులు 1.62 కోట్లు కాగా మహిళలు 1.63  కోట్లున్నారు. 27,175 మంది ఇప్పటికే ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1.47 లక్షల మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఇవాళ ఉదయం 5.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది, పార్టీల ఏజెంట్లతో మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వెంటనే వాటిని రీప్లేస్ చేశారు. తెలంగాణ ఎన్నికలకు మొత్తం 60 వేల ఈవీఎంలు సిద్ధం చేయగా మరో 14 వేలు రిజర్వ్‌లో ఉంచారు. 

తెలంగాణలో మొత్తం 2290 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా వీరిలో 221 మంది మహిళలున్నారు. ఎన్నికల విధుల్లో 1.85 లక్షలమంది సిబ్బందిని నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,375 ప్రాంతాల్లో 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 75 వేలమంది పోలీసుల బలగాలు మోహరించారు. ఇందులో 40 వేలమంది తెలంగాణ పోలీసులు, ఇతర రాష్ట్రాల్నించి 15 వేలమంది , 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలున్నాయి. 

ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటైంది. చాలా ప్రాంతాల్లో ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 

Also read: TS Election 2023 LIVE Voting: ఓటరు తీర్పుకు సర్వసిద్ధం.. పోలింగ్ ప్రక్రియ ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More