Home> తెలంగాణ
Advertisement

సీఎం కేసీఆర్‌ని కలిసిన టీడీపీ ఎమ్మెల్యే !

టీడీపీ ఎమ్మెల్యే విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూల స్పందన!

సీఎం కేసీఆర్‌ని కలిసిన టీడీపీ ఎమ్మెల్యే !

హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలలో ఒకరైన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు నాగార్జునసాగర్ ఎడమకాల్వ నుంచి నీరు విడుదల చేయాల్సిందిగా సండ్ర వెంకటవీరయ్య ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తిచేశారు. సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర నియోజకవర్గాల్లోని రెండు లక్షల ఎకరాల్లోని మెట్ట, ఆరుతడి పంటలకు నీరు అందించి ఆయా ప్రాంతాల్లోని రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఆయన ముఖ్యమంత్రికి ఓ వినతి పత్రాన్ని అందజేశారు. 

సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి మేరకు ఖమ్మం జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు నీరు అందించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషికి ఆదేశాలు జారీచేశారు.

Read More