Home> తెలంగాణ
Advertisement

రేవంత్ కాంగ్రెస్‌లో చేరికపై టి.పీసీసీ రియాక్షన్

రేవంత్ కాంగ్రెస్‌లో చేరికపై టి.పీసీసీ రియాక్షన్

రేంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక అంశాన్ని తొలుత ఖండించిన టి.పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ..ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఆయన స్వరం మార్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో చేరుకున్న ఉత్తమ్ కుమార్ కు  రేవంత్ కాంగ్రెస్ లో చేరికపై విలేఖరులు ప్రశ్నించగా.. ఆయన 'నో కామెంట్' బదులిచ్చారు.  రేవంత్ రెడ్డి, తాను కలసి రాహుల్ తో భేటీ అయ్యామనే వార్తల్లో నిజం లేదని అన్నారు. పార్టీ పనుల్లో భాగంగా తాను ఢిల్లీ వెళ్లానని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి శంషాబాద్ చేరుకున్న ఒక గంట వ్యవధిలోనే రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవడం కొనమెరుపు..!

తెలంగాణ టీడీపీ ముఖ్యనేత రేవంత్ కాంగ్రెస్ లో చేరుతున్నారని గత కొన్ని రోజుల నుంచి జోరుగా  ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. రేవంత్, టి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇద్దరూ ఒకే సారి ఢిల్లీ పర్యటనలో ఉండటం వంటి పరిణామాలతో ఈ ఊహాగాలకు మరింత బలం చేకూరింది.రేవంత్ తో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు వార్తలు వినిపించాయి.  కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ స్వీకరించే లోపే రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

Read More