Home> తెలంగాణ
Advertisement

హైదరాబాద్‌లో ఆటో పల్టీలు.. మహిళ మృతి

హైదరాబాద్‌లో విషాదం జరిగింది. ఆటో పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు చనిపోయిన ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లో ఆటో పల్టీలు.. మహిళ మృతి

హైదరాబాద్ : చాదర్ ఘాట్ బ్రిడ్జి వద్ద విషాదం చోటుచేసుకుంది. ఆటో బోల్తాపడి ఓ మహిళ మృతి చెందింది. బుధవారం వేకువజామున నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ 28 W 6708 అనే నెంబరు ఆటో చాదర్ ఘాట్ బ్రిడ్జిపై వెళ్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పింది. బ్రిడ్జి మీద ఆటో మూడు పల్టీలు కొట్టింది.

దారుణం.. లిఫ్ట్ ఇచ్చి పొరుగింటి యువతిపై అత్యాచారం 

ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తోన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Avengers బ్యూటీ స్కార్లెట్ జాన్సన్ అందాలివిగో!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More