Home> తెలంగాణ
Advertisement

Hakimpet: కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి గవర్నర్, మంత్రుల నివాళి

Colonel Santosh Babu`s mortal remains | హైదరాబాద్: లడాఖ్‌లోని భారత్ - చైనా సరిహద్దుల వద్ద గాల్వన్ వ్యాలీలో భారత సైనికులకు, చైనా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం హైదరాబాద్ చేరుకుంది.

Hakimpet: కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి గవర్నర్, మంత్రుల నివాళి

Colonel Santosh Babu`s mortal remains | హైదరాబాద్: లడాఖ్‌లోని భారత్ - చైనా సరిహద్దుల వద్ద గాల్వన్ వ్యాలీలో భారత సైనికులకు, చైనా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం హైదరాబాద్ చేరుకుంది. ప్రత్యేక విమానంలో హకీంపేట ఆర్మీ ఎయిర్ బేస్‌కు (Hakimpet air base) చేరుకున్న కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పార్థివదేహానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు కల్వకుంట్ల తారకరామా రావు, సీహెచ్ మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి నివాళి అర్పించారు.

అనంతరం హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం రోడ్డు మార్గం ద్వారా సూర్యాపేటకు తరలించనున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి కూడా సూర్యాపేటకు చేరుకుని అక్కడ రేపు జరగనున్న సంతోష్ బాబు అంత్యక్రియల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొననున్నారు.

సూర్యాపేట సమీపంలోని కేసారంలో కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు కుటుంబం పేరిట అర ఎకరం స్థలం ఉంది. ఇక్కడే సంతోష్ బాబు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్, ఎస్పీ తెలిపారు.

Read More