Home> తెలంగాణ
Advertisement

మైనర్‌పై అత్యాచారం.. నిందితుడ్ని కొట్టిచంపిన స్థానికులు

ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన 47ఏళ్ల వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు.

మైనర్‌పై అత్యాచారం.. నిందితుడ్ని కొట్టిచంపిన స్థానికులు

నిజామాబాద్: ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన 47ఏళ్ల వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని నందిపేట్ మండలం డొంకేశ్వర్‌కు చెందిన మేడరి సాయన్న అనే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడు. ఇంటి పక్కనే ఉన్న ఏడేళ్ల పాపపై కన్నేశాడు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చాకెట్లు ఇస్తానని చెప్పి... చిన్నారిని తన ఇంట్లోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఘటన జరిగిన తరువాత రోజు చిన్నారి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో... ఆమె స్థానికులకు సమాచారం ఇచ్చింది. అందరూ కలిసి సాయన్నను పట్టుకొని ఊరి మధ్యలో ఉన్న ఓ చెట్టుకు కట్టేశారు.

చెట్టకు కట్టేసిన సాయన్నను స్థానికులందరూ కలిసి చావబాదారు. రక్తపు మడుగులో నిందితుడు అక్కడే కుప్ప కూలిపోయాడు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని నిందితుడిని, బాధితురాలిని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. నిందితుడిని ఆసుపత్రికి తరలిస్తున్న తరుణంలో మృతి చెందాడు.  ఘటనపై కేసు నమోదు చేసి... స్థానికుల్ని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Read More