Home> తెలంగాణ
Advertisement

తెలంగాణలో బీజేపీకి గట్టి షాక్.. ఆ నేత గుడ్ బై !

తెలంగాణలో ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.

తెలంగాణలో బీజేపీకి గట్టి షాక్.. ఆ నేత గుడ్ బై !

తెలంగాణలో ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనగామ జిల్లా బీజేపీలో క్రమశిక్షణ లోపించిందని ఆయన అన్నారు. నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు పార్టీ వీడనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆయన గత కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. 

ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చేర్యాల నుంచి టిఆర్ఎస్ టికెట్టు పై 2004లో ఎమ్మెల్యేగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గెలిచారు. ఆయన తిరిగి అదే పార్టీలో చేరనున్నట్లు సమాచారం. జనగామ జిల్లాలోని అన్ని గ్రామాలు తిరుగుతానని.. కార్యకర్తల, ప్రజల అభీష్టానుసారం వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఏ పార్టీలో చేరుతానో చెప్తానని మీడియాకు వెల్లడించారు.

Read More