Home> తెలంగాణ
Advertisement

దేశంలోనే మొట్టమొదటిసారిగా..

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి), దేశంలోనే మొదటిసారిగా పౌర సంస్థగా అవతరించింది. కార్పొరేషన్ సమర్పించిన బడ్జెట్‌ను ఆమోదించడానికి జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కౌన్సిల్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది.

దేశంలోనే మొట్టమొదటిసారిగా..

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి), దేశంలోనే మొదటిసారిగా పౌర సంస్థగా అవతరించింది. కార్పొరేషన్ సమర్పించిన బడ్జెట్‌ను ఆమోదించడానికి జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కౌన్సిల్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది.

డిప్యూటీ మేయర్ బాబా ఫాసియుద్దీన్ మాట్లాడుతూ.. సీఏఏ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలు భారత రాజ్యాంగానికి విరుద్ధమని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అన్నారు.

సీఏఏను వ్యతిరేకించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇప్పటికే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారని, తెలంగాణ అసెంబ్లీ త్వరలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదిస్తుందని మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ అన్నారు. సీఏఏను అమలు చేయాలనే కేంద్రం ప్రణాళికలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన దేశంలో మొట్టమొదటి మునిసిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఆయన అన్నారు.

మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఒక లౌకిక రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం లౌకిక ప్రభుత్వం అని అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సీఏఏను వ్యతిరేకించడంపై, ఇతర రాష్ట్రాలకు ఉదాహరణగా నిలిచేవిదంగా, వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More