Home> తెలంగాణ
Advertisement

గోదాములో అగ్ని ప్రమాదం..!!

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో తెల్లవారుజామునే విషాదం నెలకొంది. మూడు గోదాములలో మంటలు చెలరేగాయి. సుభాష్ నగర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. 

గోదాములో అగ్ని ప్రమాదం..!!

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో తెల్లవారుజామునే విషాదం నెలకొంది. మూడు గోదాములలో మంటలు చెలరేగాయి. సుభాష్ నగర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. 

సుభాష్ నగర్‌లోని మూడు స్క్రాప్ గోదాములలో ఇవాళ తెల్లవారుజామున ఉన్నట్టుండి  మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఎగిసిపడుతున్న మంటలు ఆర్పేశారు. రెండు ఫైర్ ఇంజిన్లు అరగంటపాటు మంటలు ఆర్పేందుకు శ్రమించాల్సి వచ్చింది. 

చుట్టూ జనావాసాలు ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఐతే మంటలు పూర్తిగా అరిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More