దుబ్బాక ఉప ఎన్నికలు ప్రచారం, ఓటింగ్ ఎంత రసవత్తరంగా సాగిందో నేడు ఓట్ల లెక్కింపు ఫలితాలు (Dubbaka By Election Results) ప్రక్రియ సైతం అదే తీరుగా జరుగుతుంది. రౌండ్ రౌండ్లో ఫలితాలు, ఆధిక్యాలు మారిపోతున్నాయి. తాజాగా వరుసగా మూడు రౌండ్లలో అధికార టీఎర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. 13, 14, 15 మూడు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఓవరాల్గా బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా.. వరుసగా మూడు రౌండ్లలో కారు దూసుకెళ్లింది.
13వ రౌండ్లో టీఆర్ఎస్కు 304 ఓట్ల ఆధిక్యం, 14వ రౌండ్లో 288 ఓట్ల మెజార్టీ సాధించింది. అనంతరం 15వ రౌండ్ ఫలితాలలోనూ TRS 955 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. అయితే ఓవరాల్గా చూస్తే దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఇంకా ఆధిపత్యం కొనసాగిస్తోంది. అయితే వరుసగా మూడు రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి మెజార్టీ రావడంతో మరోసారి గులాబీ శ్రేణులలో ఆశలు చిగురిస్తున్నాయి.
దుబ్బాక ఉప ఎన్నికలు 15వ రౌండ్ పలితాలు
బీజేపీ: 2072
టీఆర్ఎస్: 3027
ఈ రౌండ్లో టీఆర్ఎస్ 955 ఓట్ల మెజార్టీ సాధించినప్పటికీ ఓవరాల్గా కౌంటింగ్ జరిగిన 15 రౌండ్ల అనంతరం బీజేపీ 2483 ఓట్ల ఆధిక్యంలో ఉండటం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe