Home> తెలంగాణ
Advertisement

డల్లాస్ లో తెలుగు దంపతుల మృతి..

అమెరికాలోని టెక్సాస్‌లోని డల్లాస్‌కు చెందిన ఫ్రిస్కోలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకున్న కారు ప్రమాదంలో మరణించిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ లోని ముషీరాబాద్‌కు చెందినవారని పేర్కొన్నారు. 
 

డల్లాస్ లో తెలుగు దంపతుల మృతి..

డల్లాస్: అమెరికాలోని టెక్సాస్‌లోని డల్లాస్‌కు చెందిన ఫ్రిస్కోలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకున్న కారు ప్రమాదంలో మరణించిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ లోని ముషీరాబాద్‌కు చెందినవారని పేర్కొన్నారు. 

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని, ఒక వ్యక్తి గాయపడ్డారని తెలిపారు. గాయపడిన కారు డ్రైవర్ కధనం ప్రకారం మరణించిన వారిలో దివ్య ఆవులా(34), దివ్య భర్త రాజా గవిని(41), ప్రేమ్ నాధ్ రామనాథం అనే మరొక వ్యక్తి (42), ఈ ముగ్గురు ఘటనా స్థలంలోనే మరణించినట్లు గుర్తించారు.

కాగా, సాయంత్రం 6:40 గంటలకు ప్రయాణిస్తున్న సమయంలో హెవీ లోడ్ తో ఎదురుగా వస్తున్న ట్రక్, కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని డ్రైవర్ తెలిపారని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. కారు ఎడమ మలుపు చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని, అయితే కారు డ్రైవర్ జువెనైల్ కావడంతో పేరు విడుదల చేయబడలేదని, తీవ్రగాయాలతో ఉన్న డ్రైవర్ ను  ఆసుపత్రికి తీసుకువెళ్లారని నివేదికల్లో పేర్కొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More