Home> తెలంగాణ
Advertisement

తెలంగాణలో తగ్గుముఖంపడుతోన్న కరోనా...

గత వారం రోజుల నుండి పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య

తెలంగాణలో తగ్గుముఖంపడుతోన్న కరోనా...

హైదరాబాద్: గత వారం రోజుల నుండి పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 1122కు చేరింది. కొత్తగా నమోదైన 15 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 12 పాజిటివ్ కేసులు జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలోనివని, ముగ్గురు వలస కూలీలకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఇదిలాఉండగా కరోనా పాజిటివ్ బాధితులలో చికిత్స తీసుకుంటున్న వారిలో 45 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో డిశ్చార్జ్‌ అయిన కరోనా బాధితుల సంఖ్య 693కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు 400 మంది ఉన్నారు. కొత్తగా నమోదయ్యే కేసులకంటే ప్రతి రోజు కోలుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం ఉపశమనాన్నిస్తోందని అన్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More