Home> తెలంగాణ
Advertisement

Gold Smuggling: పకడ్బందీగా 25 కేజీల బంగారం స్మగ్లింగ్, ముఠా ఆటకట్టించిన హైదరాబాద్ పోలీసులు

Smuggled Gold Seized At Panthangi Toll Plaza: పోలీసులు, నిఘా విభాగం అధికారులు ఎంత హెచ్చరించినా బుద్ది మార్చుకోవడం లేదు. కొత్త దారులు వెతుక్కుంటూ మరీ అడ్డదారులు తొక్కుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 25 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ఆటకట్టించారు.

Gold Smuggling: పకడ్బందీగా 25 కేజీల బంగారం స్మగ్లింగ్, ముఠా ఆటకట్టించిన హైదరాబాద్ పోలీసులు

Smuggled Gold Seized At Panthangi Toll Plaza: స్మగ్లర్లు రోజురోజుకూ తెలివిమీరిపోతున్నారు. పోలీసులు, నిఘా విభాగం అధికారులు ఎంత హెచ్చరించినా బుద్ది మార్చుకోవడం లేదు. కొత్త దారులు వెతుక్కుంటూ మరీ అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠాను డీఆర్ఐ, హైదరాబాద్ జోనల్ యూనిట్ అదుపులోకి తీసుకుంది.

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 25 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ఆటకట్టించారు. నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కారులో బంగారం తీసుకెళ్తున్న ముఠాను డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపించడంతో కారును తనిఖీ చేయగా అందులో ఏకంగా 25 కిలోల బంగారం పట్టుబడింది.

Also Read: SBI Alert: ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఎస్‌బీఐ రూ.2 లక్షల ఇన్సూరెన్స్

కోల్‌కతా ముఠా ఈ బంగారం స్మగ్లింగ్‌కు పథక రచన చేసింది. కోల్‌కతా నుంచి చెన్నైకి బంగారం స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా కారులో తరలిస్తే తనిఖీలు ఉండవని భావించినట్లు తెలుస్తోంది. ముగ్గురు స్మగ్లర్లుతో డీల్ కుదర్చుకున్నారు. ముఠా పకడ్బందీగా కోల్‌కతా నుంచి కారులో బంగారాన్ని చెన్నైకి తరలిస్తుండగా హైదరాబాద్ జోనల్ యూనిట్ విభాగం వారి ఆట కట్టించింది. బంగారం సీజ్ చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Also Read: Gold Price Today In Hyderabad: గుడ్ న్యూస్.. మళ్లీ పతనమైన బంగారం ధర, మిశ్రమంగా వెండి ధరలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More