Home> క్రీడలు
Advertisement

టీమిండియా టాప్ ఆర్డన్‌ను కుప్పకూల్చిన లక్మల్‌

  

 టీమిండియా టాప్ ఆర్డన్‌ను కుప్పకూల్చిన లక్మల్‌

కోల్ కతా:  శ్రీలంక తో జరుగుతున్న తొలిటెస్ట్ లో  భారత్ పీలలోతు కష్టాల్లో పడింది. శ్రీలంక బౌలర్ లక్మల్‌ ధాటికి కేవలం 17 పరుగులకే టీమిండియా టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పుకూలింది. ఎదుర్కొన్న తొలిబంతికే  ఓపెనర్ లోకేష్ రాహుల్ డకౌట్  కాగా..  ధావన్ తన వ్యక్తిగత స్కోర్ 8 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం వర్షం అడ్డుపడటంతో మ్యాచ్ కు కాసేపు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఆటను ప్రారంభించిన వెంటనే కోహ్లీ (0) రూపంలో  టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. ఈ మూడు వికెట్లు కూడా లక్మల్ తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పూజరా 8, రహానే 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్‌ను చక్కదిద్దే బాధ్యత ఇక మిడిల్ ఆర్డర్‌పై ఉంది. 

Read More