Home> క్రీడలు
Advertisement

కేప్ టౌన్: భారత్ 209 పరుగులకు ఆలౌట్

సఫారీల బౌలింగ్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది భారత్. అశ్విన్, సాహా, భవనేశ్వర్, పాండ్య ఔట్ కావడంతో టీమిండియా తొలిటెస్టులో 209 పరుగులకు అల్ఔట్ అయ్యింది. 

కేప్ టౌన్: భారత్ 209 పరుగులకు ఆలౌట్

దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరుగుతోన్న భారత్-సౌతాఫ్రికా తొలిటెస్టులో భారత బౌలర్లు రాణించడంతో సౌతాఫ్రికా జట్టు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ లో 286కు ఆలౌట్ అయింది. ఆతరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది.

శనివారం ఓవర్ నైట్ స్కోర్ తో ఆట ప్రారంభించిన భారత్.. 57 పరుగుల వద్ద రోహిత్ వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్ల నష్టానికి భారత్ 76 పరుగులు చేసింది. ఆతరువాత సఫారీల బౌలింగ్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. అశ్విన్, సాహా, భవనేశ్వర్, పాండ్య ఔట్ కావడంతో టీమిండియా తొలిటెస్టు లో 209 పరుగులకు అల్ఔట్ అయ్యింది. సౌతాఫ్రికా కంటే 77 పరుగులు వెనుకబడి ఉంది. హార్దిక్ పాండ్య, భవనేశ్వర్ మినహా వచ్చిన బ్యాట్స్ మెన్లు అందరూ వచ్చిన వారువచ్చినట్లు పెవిలియన్ కు చేరారు. విజయ్1, ధావన్16, పుజారా26, కోహ్లీ5, రోహిత్11, అశ్విన్12, సాహా0, బుమ్రా2 పరుగులు చేసి ఔటయ్యారు.

Read More