Home> క్రీడలు
Advertisement

Shahid Kapoor trolled: 'క్రికెటర్​గా సినిమా తీస్తూ.. క్రికెట్​పై కనీస అవగాహన లేదా?'

Shahid Kapoor trolled: సోషల్ మీడియాలో బాలీవుడ్ నటుడు షాహిద్​ కపూర్​పై ట్రోల్స్ వైరల్​ అవుతున్నాయి. క్రికెట్ గురించి కనీస అవగాహన లేదంటూ ఆయనపై నెటిజన్లు పైర్ అవుతున్నారు.

Shahid Kapoor trolled: 'క్రికెటర్​గా సినిమా తీస్తూ.. క్రికెట్​పై కనీస అవగాహన లేదా?'

Shahid Kapoor trolled: బాలీవుడ్ హీరో షాహిద్​ కపూర్​పై నెటిజన్లు ట్రోల్స్​ చేస్తున్నారు. ఇటీవల ఇన్​స్టాగ్రామ్​లో ఆయన పెట్టిన పోస్టే ఇందుకు కారణం. ఆ పోస్ట్​ డిలీట్​ చేసినా.. అప్పటికే చాలా మంది దానిని స్క్రీన్​షాట్​ తీసుకుని షాహిద్​ కపూర్​పై ట్రోల్స్​కోసం వాడుతున్నారు.

ఇంతకీ ఏమైందంటే..

ఫిబ్రవరి 5న జరిగిన అండర్​-19 వరల్డ్​కప్​లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. కెప్టెన్​ యశ్​ ధూల్ సారధ్యంలో యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్​ను చిత్తు చేశారు. దీనితో ఐదో సారి టీమ్​ ఇండియా కుర్రాళ్ల టీమ్ వరల్డ్​కప్​ను ముద్దాడారు. ఈ సారి టీమ్​కు యశ్ ధూల్​ సారథ్యం వహించాడు.

దీనితో యువ క్రికెటర్లకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు చాలా మంది కుర్రాళ్లను పొగిడారు. బీసీసీఐ.. యువ ఆటగాళ్లు ఒక్కొక్కరికి రూ.40 నజరానా ప్రకటిచింది. సపోర్ట్ స్టాఫ్​కు రూ.25 లక్షల చొప్పున రివార్డ్​ ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఇక ఈ రికారక్డు విజయంపై ఇన్​స్టాగ్రామ్​ వేదికగా బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్​ కూడా మెచ్చుకున్నారు. టీమ్ ఇండియాను పొగుడుతూ ఓ పోస్ట్ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. షాహిద్​ తన పోస్ట్​లో ఓ పొరపాటు చేశారు.

తన పోస్టులో ప్రస్తుత టీమ్​కు బదులు.. 2018లో కప్పు గెలిచిన టీమ్​ ఫొటోను షేర్ చేశారు. అప్పటి అండర్​ 19 కెప్టెన్ పృధ్వి షాను ట్యాగ్ కూడా. షాహిద్ షేర్ చేసిన ఈ ఫొటోలో పృధ్వి షాతో పాటు, శుభ్​మన్​గిల్​, కమలేశ్​ నాగర్కోటి, శివమ్​ మావి సహా ఇతర ప్లేయర్స్ ఉన్నారు.

అయితే తన పోస్ట్​కు వచ్చిన కామెంట్స్ చూసిన షాహిద్​..  కొద్ది సేపటికి దానిని డిలీట్​ చేశారు. అయితే నెటిజన్స్​ అప్పటికే ఆ పోస్ట్​ను స్క్రీన్​షాట్ తీసుకున్నారు. అంతే కాకుండా.. వెంటనే దానిని సోషల్ మీడియోలో షేర్​ చేస్తూ.. షాహిద్​పై మండిపడుతున్నారు.

త్వరలో విడుదల కానున్న 'జెర్సీ'లో క్రికెటర్​గా కనిపించనున్న షాహిద్​కు.. టీమ్ ఇండియాపై కనీస అవగాహన లేదంటూ ట్రోల్స్ చేస్తున్నారు కొందరు.

కొంత మందేమో.. షాహిద్ కపూర్​ ఇంకా.. కబీర్ సింగ్ ఫీవర్​లోనే ఉన్నాడంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.

Also read: India vs West Indies: తొలి వన్డేలో భారత్ ఘన విజయం- 22 ఓవర్లు మిగిలి ఉండగానే..

Also read: U19 World Cup 2022: అండర్‌-19 వరల్డ్ కప్ విజేతగా భారత్.. కుర్రాళ్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter 

Read More