Home> క్రీడలు
Advertisement

క్రికెటర్ షమీకి సమన్లు.. నేడు విచారణ

క్రికెటర్ మహ్మద్ షమీని కోల్‌కతా పోలీసులు బుధవారం విచారించనున్నారు.

క్రికెటర్ షమీకి సమన్లు.. నేడు విచారణ

క్రికెటర్ మహ్మద్ షమీని కోల్‌కతా పోలీసులు బుధవారం విచారించనున్నారు. షమీ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నేడు విచారణకు హాజరు కావలసిందిగా షమీకి సమన్లు జారీ చేశారు. క్రికెటర్ షమీపై ఆయన భార్య గతంలోనే గృహహింస, హత్యాయత్నం కింద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం అతడిని విచారించనున్నారు. ఈ కేసులో విచారణకు షమీ సోదరుడికి కూడా పోలీసులు సమన్లు జారీ చేశారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విచారణ జరగనుంది. అయితే షమీ సోదరుడుకి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని, కొంత సమయం ఇవ్వాలని కోరగా, అందుకు పోలీసులు అంగీకరించినట్టు తెలుస్తోంది.

 

కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు షమీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. షమి సోమవారం కోల్‌కతాతో మ్యాచ్‌ సందర్భంగా నగరానికి వచ్చాడు.  మ్యాచ్ నిమిత్తం కోల్‌కతాకు షమీ వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు ఈ కేసు విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేయడం గమనార్హం. 21న బెంగళూరుతో మ్యాచ్‌ కోసం ఢిల్లీ ఆటగాళ్లంతా వెళ్లిపోయినా, విచారణ కోసం షమి మాత్రం కోల్‌కతాలోనే ఉన్నారు.

 

Read More