Home> క్రీడలు
Advertisement

ఆసిస్ గడ్డపై చరిత్ర సృష్టించిన జస్ప్రిత్ బుమ్రా

ఆస్ట్రేలియా గడ్డపై ఆ రికార్డ్ సాధించిన తొలి ఇండియన్ పేస్ బౌలర్ బుమ్రానే

ఆసిస్ గడ్డపై చరిత్ర సృష్టించిన జస్ప్రిత్ బుమ్రా

ఆస్ట్రేలియా గడ్డపై బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా జట్టు ఆటగాళ్లు.. ఆ విజయంతోపాటే పలు ఇతర రికార్డులు సొంతం చేసుకున్నారు. అందులో జస్ప్రిత్ బుమ్రా కూడా ఒకరు. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన జస్ప్రిత్ బుమ్రా.. ఆస్ట్రేలియా గడ్డపై ఒకే టెస్ట్ మ్యాచ్‌లో 9 వికెట్లు తీసిన మొట్టమొదటి ఇండియన్ పేస్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టినందుకుగాను ఈ టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సైతం లభించింది. ఇతర ఆటగాళ్లతో పోల్చుకుంటే.. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌లో తక్కువ అనుభవమే వున్నప్పటికీ బుమ్రా సాధించిన ఈ విజయం మాత్రం అపూర్వమైనదని బుమ్రాను దిగ్గజాలైన ఇతర క్రికెటర్స్ అభినందించారు.

Read More