Home> క్రీడలు
Advertisement

ఆశిష్ నెహ్రా వీడ్కోలు పార్టీలో టీమిండియా

ఆశిష్ నెహ్రా వీడ్కోలు పార్టీలో టీమిండియా

18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను విజయవంతంగా ముగింపు ప‌లికిన భార‌త క్రికెట‌ర్‌ ఆశిష్ నెహ్రాకు స‌హ‌ క్రికెట‌ర్లు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. ప్రవేట్ గా జరిగిన ఈ పార్టీకి టీం ఇండియా జట్టు స‌భ్యులు, కుటుంబ స‌భ్యులు, ఆప్తులు మాత్ర‌మే పాల్గొన్నారు. ఈ పార్టీలో ఆశిష్ నెహ్రా ముఖాన్ని కేకుతో పూసేసారు. పార్టీకి హాజ‌రైన కొంత‌మంది అక్కడి ఫొటోల‌ను, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.  

జ‌ట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి ఆశిష్ నెహ్రా కేకు తినిపించ‌డం, పూర్తిగా కేకుతో నిండిపోయిన ఆశిష్  ముఖాన్ని కిందున్న వీడియో, ఫొటోల్లో చూడొచ్చు. ఆశిష్ నెహ్రా బెస్ట్ ఫ్రెండ్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ పార్టీకి వ‌చ్చాడు. 1997లో రంజీ మ్యాచ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన 38 ఏళ్ల ఆశిష్ నెహ్రా..  అప్పట్లో సెహ్వాగ్‌తో క‌లిసి దిల్లీ రాష్ట్ర జ‌ట్టులో ఆడాడు. 

 

 

Read More