Home> ఆధ్యాత్మికం
Advertisement

Venus Rahu Conjunction: అంతుచిక్కని గ్రహంతో శుక్రుడి సంయోగం..ఈ 3 రాశుల వారికి ఏం జరగబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..


Venus Rahu Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్ర గ్రహం మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే ఇప్పటికే అదే రాశిలో రాహు ఉండడంతో రెండు గ్రహాలు కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని నష్టాలతో పాటు లాభాలు కలుగుతాయి.

Venus Rahu Conjunction: అంతుచిక్కని గ్రహంతో శుక్రుడి సంయోగం..ఈ 3 రాశుల వారికి ఏం జరగబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Venus Rahu Conjunction: జ్యోతిష్యంలో అంతుచిక్కని గ్రహాలుగా పరిగణించే రాహు, కేతు, శని జాతకంలో అశుభ స్థానంలో ఉంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ముఖ్యంగా వీటి ప్రభావం వ్యక్తిగత జీవితంపై చూపి అనేక రకాల దీర్ఘకాలిక సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శని అశుభ స్థానంలో ఉన్నవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇవే మూడు గ్రహాలు జాతకంలో శుభ స్థానంలో ఉంటే జీవితంలో సంపాదనకు ఎలాంటి లోటు ఉండదు అంతేకాకుండా ఎంతటి కఠిన తరమైన పనులైన సులభంగా చేయగలుగుతారు. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కీడు గ్రహాలుగా పరిగణించే రాహు ఇప్పటికే మీనరాశిలో సంచార దశలో ఉన్నాడు అయితే మార్చి నెలలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర గ్రహం మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా రెండు గ్రహాల సంయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంయోగం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటే మరికొన్ని రాశుల వారికి అనేకరకాల దుష్ప్రభావాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత రాహు గ్రహం తిరుగమనం చేసుకుంటూ అక్టోబర్ 30వ తేదీన మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. 

ఇలా రాహు గ్రహం అక్టోబర్ 30వ తేదీన మేష రాశిలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి 2025 సంవత్సరంలో అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శుక్రుడు, రాహు గ్రహాల కలయిక కారణంగా వృషభ రాశితో పాటు ధనస్సు రాశి వారు 2025 సంవత్సరంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంతేకాకుండా ఈ ప్రభావం మరికొన్ని రాశుల వారిపై కూడా పడే అవకాశాలున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ చెడు ప్రభావం కారణంగా వ్యక్తిగత జీవితంలో అనేక ఇబ్బందులు రావచ్చు.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

2025 ప్రారంభ నెలలో మాత్రమే వృషభ, ధనస్సు, మిథున రాశుల వారు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు ఆ తర్వాత మంచి లాభాలు కలిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశుల వారు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాలు చేస్తున్న వారు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా భాగస్వాములతో చిన్నచిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మూడు రాశుల వారిలో ఒక రాశి వారు ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు కూడా పొందగలుగుతారు.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More