PHOTOS

Mahashivaratri 2024: దక్షిణ భారతదేశంలోని 5 శివాలయాలు.. ఈ మహాశివరాత్రికి తప్పక సందర్శించండి..

దూమతంలో శివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగ. దేశవ్యాప్తంగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే, ఈ మహాశివరాత్రికి మీరు కూడా ఏదైన ప...

Advertisement
1/5
శ్రీకాళహస్తీ
శ్రీకాళహస్తీ

శ్రీకాళహస్తీశ్వర దేవాలయం.. మన భారతదేశంలో అత్యంత పురాతమైన దేవాలయాల్లో శ్రీకాళహస్తి ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు ఇక్కడి ఆలయ గాలిగోపురం. మహాశివరాత్రిరోజు అత్యంత వైభవోపేతంగా కనిపిస్తుంది ఈ ఆలయం. ఈ దేవాలయంలో రాహుకేతు పూజ అత్యంత ప్రసిద్ధి చెందింది. దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా హిందూ మతాన్ని అనుసరించేవారు ఈ ఆలయానికి వచ్చి రాహుకేతు పూజలు చేస్తారు.

2/5
శ్రీశైల మళ్లికార్జునస్వామి
శ్రీశైల మళ్లికార్జునస్వామి

శ్రీశైల మళ్లికార్జునస్వామి ఆలయం.. ఈ ఆలయం కూడా దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ఆలయం. భ్రమరాంభ మళ్లికార్జున స్వామి ఈ దేవాలయంలో దర్శనమిస్తారు. శ్రీశైలంలో శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ఇది 12 ప్రముఖ జ్యోతిర్లింగాలలలో ఇది ఒకటి.

3/5
 రామనాథస్వామి
 రామనాథస్వామి

 రామనాథస్వామి ,రామేశ్వరం .. తమిళనాడులోని రామనాథస్వామి దేవాలంయ ద్వీపలో ఉన్న శైవక్షేత్రం. ఇది కూడా 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడే రాముడు సేతువును నిర్మించాడని నమ్ముతారు. రావణున్ని చంపిన తర్వాత బ్రహ్మహత్య దోషం తొలగించుకోవడానికి లింగ ప్రతిష్ఠ చేస్తాడు. అందుకే ఈ ఆలయం పేరు రామేశ్వరంగా పేరొందింది.

4/5
తిరువణ్ణామలై..
తిరువణ్ణామలై..

తిరువణ్ణామలై.. ఇది కూడా తమిళనాడులో ఉంది. అరుణాచలం ఇది పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం చోళ సామ్రాజ్య కాలంలో నిర్మించింది. భారతదేశంలో ఎత్తైన గోపురాల్లో ఇది ఒకటిగా నిలిచింది. మహాశివరాత్రి అత్యంత విశేషంగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా విమానాశ్రయం, బస్సు సౌకర్యం కలిగి ఉంది.

5/5
కైలాసనాథర్ ఆలయం..
కైలాసనాథర్ ఆలయం..

కైలాసనాథర్ ఆలయం.. ఇది ద్రావిడ వాస్తు శిల్ప శైలికి ఉదాహరణ. 700 CE లో నరసింహ వర్మన్ 2 దీన్ని నిర్మించారు. ప్రధానంగా ఈ ఆలయం ఇసుకరాయితో నిర్మించారు. కైలాసనాథర్ ఆలయం కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉంది. మహాశివుని ఆరాధన ఈ ఆలయంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది.





Read More