PHOTOS

Virat Kohli: ఐపీఎల్‌ నుంచి బిగ్‌ అప్‌డేట్.. ఆర్‌సీబీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై..?

్స్ బెంగళూరు ఈసారైనా కప్ కొడుతుందా..? విరాట్ కోహ్లీ ఖాతాలో ఐపీఎల్‌ టోర్నీ చేరుతుందా..? ఐపీఎల్ సీజన్ మొదలైన ప్రతిసారి అభిమానుల్లో ఇదే చర...

Advertisement
1/8

ఐపీఎల్ 2025 వేలానికి ముందు బీసీసీఐ నిబంధనలు రూపొందంచనుంది. ఏ టీమ్ ఎంత మంది ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలనే విషయంపై క్లారిటీ ఇవ్వనుంది. ఐపీఎల్ టీమ్ యజమానులతో ఈ నెల 30 లేదా 31వ తేదీల్లో సమావేశం నిర్వహించనుంది.   

2/8

అదేవిధంగా ఆటగాళ్ల వేలం మొత్తం, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తదితర అంశాలపై చర్చించనున్నారు. నవంబర్ లేదా డిసెంబర్‌లో ఐపీఎల్ వేలం తేదీని కూడా ఖరారు చేయనున్నారు.  

3/8

ఐపీఎల్ వేలం తేదీలను ఖరారు అయిన తరువాత వేలానికి ఒక నెల ముందు అన్ని జట్లు కూడా తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను అందజేయాలి. ఇందుకు బీసీసీఐ డెడ్‌లైన్ కూడా విధిస్తుంది.  

4/8

గతంలో నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉండగా.. ఈ నిబంధన మార్చాలని అన్ని జట్లు డిమాండ్ చేస్తున్నాయి. ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను పెంచాలని కోరుతున్నాయి. ఒక వేళ బీసీసీఐ అనుమతించకపోతే అన్ని జట్లూ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కీలక ఆటగాళ్లను టీమ్ నుంచి రిలీజ్ చేసే అవకాశం ఉంది.  

5/8

సీజన్ ఆరంభం నుంచి కప్ కోసం ఎదురుచూస్తున్న ఆర్‌సీబీ కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకునే అవకాశాల్లేవని అంటున్నారు.  

6/8

టీమ్‌లో వ్యక్తిగతంగా ఆడుతున్నా.. జట్టుగా ఆడటంలో ఆటగాళ్లందరూ విఫమలవుతున్నారు. టీమ్‌లో VIP సంస్కృతి కారణంగా జట్టు ట్రోఫీని గెలవకపోవడానికి చాలా మంది మాజీలు కూడా ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.  

7/8

కోహ్లీ అంటే ఆర్‌సీబీ.. ఆర్‌సీబీ అంటే కోహ్లీలా మారిపోయిన తరుణంలో ఈ రన్‌ మెషిన్‌ను ఆర్‌సీబీ వదులుకుంటుందా..? అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.   

8/8

ఐపీఎల్ 2025 వేలానికి ముందు విరాట్ కోహ్లీని రిలీజ్ చేయడంపై ఆర్‌సీబీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒక వేళ కోహ్లీ ఆర్‌సీబీని వీడితే ఇది అభిమానులకు బిగ్ షాకింగ్ అవుతుంది.  





Read More