hotos: అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం 'ప్రేమమ్' ఎంతో మంది కుర్రాళ్ల మనసును దోచేసింది. ఆ సినిమా తెలుగ...
అనుపమ పరమేశ్వరన్ 1996 ఫిబ్రవరి 18న కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జన్మించింది. మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాలోనే మంచి పేరు సంపాదించింది.
ఆ తర్వాత తెలుగులో 'ప్రేమమ్', 'శతమానం భవతి', 'ఉన్నది ఒకటే జిందగీ', 'తేజ్ ఐ లవ్ యూ', 'హలో గురు ప్రేమకోసమే' చిత్రాల్లో నటించి అభిమానుల్ని సంపాదించుకుంది.
'కురుప్' సినిమాలో అలరించింది. ఇటీవలే 'రౌడీ బాయ్స్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'కార్తికేయ 2', '18 పేజేస్' లోను నటించింది. సౌత్ ఇండియన్ మూవీ ఇంటర్నేషనల్ అవార్డ్స్లో ఉత్తమ నటిగా నామినేట్ అయ్యింది.