Home> ఎన్ఆర్ఐ
Advertisement

Adilabad Man Death: పండుగ వేళ విషాదం.. పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లి..

Road Accident In Dubai: పండుగ వేళ ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన రాజు అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
 

Adilabad Man Death: పండుగ వేళ విషాదం.. పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లి..

Road Accident In Dubai: అతను సొంత ఊరిలో కూలీ పనులు దొరక్క తీవ్ర ఇబ్బంది పడేవాడు. కుటుంబ పోషణకు ఎడాది దేశానికి వలస వెళ్లాలని అనుకున్నాడు. అప్పు చేసి మరీ దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడ మంచి పని దొరకడంతో ఇక తన కష్టాలు తీరిపోయి.. కుటుంబాన్ని హ్యాపీగా చూసుకోవచ్చని సంతోషపడ్డాడు. కానీ ఇంతలోనే రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు అతడికి కబళించింది. కుటుంబాన్ని, సొంత ఊరిని వదిలి ఎక్కడో దూరాన ఉన్న దుబాయ్‌లో ప్రాణాలు పొగొట్టుకున్నాడు. పూర్తి వివరాలు ఇలా.. 

ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలంలో పండుగ వేళ ఓ కుటంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బామ్నికే గ్రామానికి చెందిన గొల్ల రాజు (39) అనే వ్యక్తి పొట్టకూటి దుబాయ్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో బామ్నికే గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. రాజు ఇక్కడ పని దొరక్కపోవడంతో దుబాయ్‌కు వెళ్లాడని గ్రామస్తులు చెబుతున్నారు. 

రోజులానే పని వెళుతుండగా.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్చించగా.. కోలుకులేక శుక్రవారం ఉదయం మరణించాడు. మృతుడికి భార్య చిన్నక్క, కుమారుడు రేవంత్‌ ఉన్నారు. చివరి చూపు కోసం రాజు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

Also Read: Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. చంపేస్తామంటూ..  

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త.. జీతాల పెంపు ఎప్పుడంటే..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More