Home> జాతీయం
Advertisement

chicken: శ్రావణమాసంలో భర్త చికెన్ తిన్నాడని..భార్య ఆత్మహత్య

chicken: రాఖీ పండుగ రోజున భర్త చికెన్ తినడం చూసి...తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్ సూరజ్​పుర్​లో జరిగింది. వివరాల్లోకి వెళితే...

chicken: శ్రావణమాసంలో భర్త చికెన్ తిన్నాడని..భార్య ఆత్మహత్య

chicken: శ్రావణ మాసం వచ్చిందంటే చాలు..మహిళలు చాలా నిష్టగా పూజలు చేస్తుంటారు. మాంసహారం భుజించకూడదనే కొన్ని నియామాలు పాటిస్తారు. కొందరిలో అయితే ఆ పట్టింపులు మరీ ఎక్కువగా ఉంటాయి. రాఖీ పండగ రోజున భర్త చికెన్ తిన్నాడన్న కోపంతో..ఓ మహిళ క్షణికావేశంలో తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య(Suicide) చేసుకుంది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్(Chhattisgarh) సూరజ్​పుర్​లో చోటుచేసుకుంది.

కరౌదా గ్రామానికి చెందిన మనీషా సింగ్ (19) ఆదివారం రక్షా బంధన్ రోజున తన భర్త రామజన్మతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రానికి వచ్చారు. ఇంతలో రామజన్మ పొరుగున ఉన్న తన అత్త ఇంటికి వెళ్లి చికెన్‌(Chicken) తింటుండగా ఆమె వద్దని వారించింది. అయినా రామ్‌జన్మ తన భార్య మాటను పెడచెవిన పెట్టి తిన్నాడు. శ్రావణ్‌ మాసం(Sravan Masam) చివరి రోజు, రక్షాబంధన్‌(Raksha Bandhan) కూడా కనుక చికెన్ తినడం ద్వారా పొరపాటు చేస్తున్నావని మనీషా తన భర్తకు చెప్పి అక్కడి నుంచి కోపంగా ఇంటికి వెళ్లిపోయింది. 

Also Read: Super Dog: 20 నిమిషాల్లోనే ఆరుగురు రేపిస్టులను పట్టుకున్న శునకం..ఎక్కడో తెలుసా?

కొంత సమయం తర్వాత రామజన్మ ఆమెకు నచ్చజెప్పడానికి ఇంటికి వెళ్లగా, అప్పటికే ఆమె క్షణికావేశంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. అతను తన భార్య(Wife)ను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పటికే శరీరం చాలా  వరకు కాలిపోయింది. వెంటనే ఆమెను అంబికాపుర్​ మెడికల్​ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More