Home> జాతీయం
Advertisement

మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మూడు దేశాల పర్యటనలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మూడు దేశాల పర్యటన కోసం ఇవాళ ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. సెర్బియా, మాల్టా, రొమేనియా దేశాల్లో వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు. ఏడు రోజులపాటు జరగనున్న ఈ పర్యటనలో భాగంగా మొదట సెర్బియా చేరుకోనున్న వెంకయ్య నాయుడు అక్కడ ఆ దేశ అధినేతలతో భేటీ కానున్నారు. ఈ మూడు దేశాల పర్యటనలో వ్యవసాయం, పర్యాటక రంగాల్లో పలు కీలక ఒప్పందాలపై వెంకయ్య నాయుడు సంతకం చేయనున్నారని విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి డా. అంజు కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 

ఆదివారం మాల్టా చేరుకోనున్నా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అక్కడ ఆ దేశ అధినేతలతో సమావేశం కానున్నారు. మాల్టాకు భారత్‌లో ఉన్న ఐటీ కంపెనీలు సేవలు అందించేందుకు అనేక అవకాశాలు ఉన్నందున ఆ దిశగా ఆ దేశాధినేతలతో ఉప రాష్ట్రపతి చర్చలు జరుపుతారని డా.అంజు కుమార్ పేర్కొన్నారు. చివరిగా ఈ నెల 18న వెంకయ్య నాయుడు రొమేనియా చేరుకోనున్నారు. భారత్‌తో చారిత్రక సంబంధాలున్న ఈ మూడు యూరప్ దేశాల పర్యటనలో వెంకయ్య నాయుడు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటన స్పష్టంచేసింది. ఇదిలావుంటే, మరోవైపు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

Read More