Home> జాతీయం
Advertisement

మరో రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశంలో కొత్తగా మరో రెండు మెట్రో రైలు ప్రాజెక్టులు

మరో రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశంలో మరో రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్ నగరాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 50-50 పెట్టుబడి పద్ధతిలో మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం కేబినెట్ ఆమోదించింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రెండు ప్రాజెక్టులు 4 ఏళ్లలో పూర్తికానున్నాయి. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం భోపాల్‌లో ఏర్పాటు కానున్న ప్రాజెక్టు 27.87 కి.మీ పరిధిలో విస్తరించి ఉండనుండగా ఈ ప్రాజెక్టు కోసం రూ.6,941.40 కోట్లు వెచ్చించనున్నారు.

ఇక ఇండోర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విషయానికొస్తే, 31.55 కిమీ రైలు మార్గంతో నగరం నలుమూలలకు సేవలు అందించనున్న ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500.80 కోట్లు వెచ్చించనున్నారు.

Read More