Home> జాతీయం
Advertisement

యూఏఈ పరాయి దేశం ఏమీ కాదు: కేరళ సీఎం పినరయి విజయన్

యూఏఈ పరాయి దేశం కాదని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. 

యూఏఈ పరాయి దేశం ఏమీ కాదు: కేరళ సీఎం పినరయి విజయన్

యూఏఈ పరాయి దేశం కాదని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ పునర్నిర్మాణంలో ఎందరో ఇండియన్స్, ముఖ్యంగా అనేకమంది కేరళ వాసులు కష్టపడి పనిచేశారని ఆయన అన్నారు. పైగా ఆ దేశం తమ ప్రభుత్వం తరఫున కేరళ వరద బాధితులకు విరాళాలు ఇచ్చే విధంగా ప్రతిపాదన చేసిందని ఆయన అన్నారు. ప్రకృతి ప్రళయానికి అతలాకుతలమైన కేరళ బాధితుల కోసం యూఏఈ ప్రభుత్వం రూ.700 కోట్లను సహాయంగా అందిస్తున్నట్లు ప్రకటించగా.. ఆ విరాళాన్ని భారత్  ప్రభుత్వం సున్నితంగా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సహాయం క్రింద కేరళకు రూ.600 కోట్లు ప్రకటించింది.

అయితే దాదాపు  రూ.20,000 కోట్ల మేరకు కేరళకు నష్టం జరిగిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. దాదాపు 12 లక్షలమంది ప్రజలు ఇప్పటికే కేరళలో వివిధ ప్రాంతాల్లో సహాయక కేంద్రాలలో తల దాచుకుంటున్నారు. అలాగే ఇప్పటి వరకు 370 మంది కేరళ పౌరులు ఈ విపత్తులో మరణించారు. 

అబుదబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి.. తాము రూ.700 కోట్లను కేరళ బాధితులకు అందజేయాలని భావిస్తున్నామని తెలిపారు. అయితే ఆ ప్రతిపాదనను భారత ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. డిసెంబరు 2004లో భారత ప్రభుత్వం స్వయంగా ప్రతిపాదించుకున్న డిజాస్టర్ ఎయిడ్ పాలసీకి అనుగుణంగానే తాము దేశంలో విపత్తులు సంభవించినప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని భారత ప్రభుత్వం తెలిపింది. ఈ పాలసీ ప్రకారం భారత ప్రభుత్వం స్వయంగా ఏ ఇతర దేశం నుండి కూడా విరాళాలను తీసుకోవడం జరగదు. అయితే ప్రధాని ఆ సహాయాన్ని నిరాకరించకుండా ఉండాల్సిందని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ తెలిపారు. 

Read More