Home> జాతీయం
Advertisement

Extra Marital Affairs: వివాహేతర సంబంధం.. ప్రైవేట్ పార్ట్స్‌పై ఫెవిక్విక్ పోసి చంపాడు

Extra Marital Affairs: అతడొక గవర్నమెంట్ స్కూల్ టీచర్. పేరు ప్రేమ్ కుమార్ (పేరు మార్చడం జరిగింది). పెళ్లయి భార్య లతతో హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అతడి ప్రియురాలి పేరు మీనా కుమారి ( పేరు మార్చడం జరిగింది). మీనాకు కూడా పెళ్లయింది. వాస్తవానికి ఈ ఇద్దరి కుటుంబాలే కాదు.. వీళ్లిద్దరి ప్రపంచం కూడా వేరే. కానీ అనుకోకుండా ఒకరికొకరు ఆకర్షితులై ప్రేమలో పడ్డారు.

Extra Marital Affairs: వివాహేతర సంబంధం.. ప్రైవేట్ పార్ట్స్‌పై ఫెవిక్విక్ పోసి చంపాడు

Extra Marital Affairs: యావత్ ప్రపంచం నివ్వెరపోయే ఘటన ఇది. వివాహేతర సంబంధాలు మనిషి జీవితాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తాయి, జీవితాలను ఎలా నాశనం చేస్తాయి, ఎలా అంతం చేస్తాయని చెప్పే ఘటన ఇది. వివాహేతర సంబందంలో ఒకరికొకరు పీకల్లోతు కూరుకుపోయిన ఆ ఇద్దరి జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడమే కాదు.. రెండు కుటుంబాలను రోడ్డున పడేసింది. పరువు ప్రతిష్టలను మంటగలిపింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు ? ఈ ఘటన జరిగింది ఎక్కడ, ఏంటనే పూర్తి వివరాలు ఈ రియల్ క్రైమ్ స్టోరీలో చూద్దాం రండి. 

అతడొక గవర్నమెంట్ స్కూల్ టీచర్. పేరు ప్రేమ్ కుమార్ (పేరు మార్చడం జరిగింది). పెళ్లయి భార్య లతతో హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అతడి ప్రియురాలి పేరు మీనా కుమారి ( పేరు మార్చడం జరిగింది). మీనాకు కూడా పెళ్లయింది. వాస్తవానికి ఈ ఇద్దరి కుటుంబాలే కాదు.. వీళ్లిద్దరి ప్రపంచం కూడా వేరే. కానీ అనుకోకుండా ఒకరికొకరు ఆకర్షితులై ప్రేమలో పడ్డారు. తాము పెళ్లి అయిన వారిమనే ఇంగితం కూడా లేకుండా పరస్పర ఆకర్షణ వివాహేతర సంబంధానికి దారితీసింది. సీన్ కట్ చేస్తే నవంబర్ 18న వీళిద్దరూ తమ ఊరికి దగ్గర్లోని అడవిలో అతి క్రూరంగా, నగ్నంగా హత్యకు గురయ్యారు. ఆ ఇద్దరి ప్రైవేటు పార్ట్స్ తెగిపోయిన గాయాలతో తీవ్ర రక్తస్రావమై కనిపించింది. అతడి మర్మాంగంపై గాయాల తీవ్రత ఎక్కువగా కనిపించింది. 

పోలీసులకు సవాలుగా మారిన మర్డర్ మిస్టరీ.. అంతిమంగా క్లూ దొరికిందిలా..
జంట హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. వీళ్ల హత్య పోలీసులకు ఓ మిస్టరీగా మారింది. దాదాపు 200 మందిని ప్రశ్నించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమర్చి ఉన్న 50 సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించిన అనంతరం ఒక నిర్ణయానికి వచ్చారు. స్థానికంగా ఉండే ఒక భూతవైద్యుడి కదలికలు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించాయి. గుడిలోనే నివాసం ఉంటున్న అతడి కదలికలపై కన్నేసి పెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ జంట హత్యకు, ఆ భూతవైద్యుడికి సంబంధం ఉందనే అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. అప్పుడు తెలిసింది అసలు విషయం.

ఇండియా టుడెలో ప్రచురించిన ఓ వార్తా కథనం ప్రకారం.. పోలీసుల అదుపులో ఉన్న భూతవైద్యుడు భలేష్ కుమార్ పోలీసుల ఎదుట మొత్తం క్రైమ్ కహాని చెప్పడం ప్రారంభించాడు. ఇదే భూతవైద్యుడు తరచుగా వెళ్లే ఇచ్చాపూరా శేషనాగ్ మందిరానికి ప్రేమ్ కుమార్ తన కుటుంబంతో వచ్చే వాడు. అదే మందిరానికి మీనా కూడా తన కుటుంబంతో వస్తుండేది. ఇక్కడే భక్తులుగా వచ్చి కలుసుకున్న ప్రేమ్ కుమార్, మీనా మధ్య పెరిగిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. మీనాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రేమ్ కుమార్ ఇంట్లో మనశ్శాంతి కరువైంది. తరచుగా భార్య లతతో గొడవపడటం మొదలుపెట్టాడు. దీంతో ప్రేమ్ భార్య లత ఈ సమస్యకు పరిష్కారం కావాలంటూ ఇదే భూతవైద్యుడైన భలేష్ కుమార్ ని కలిసింది. భూతవైద్యుడిగా అతడే ఒక పరిష్కారం చూపిస్తాడని లత భావించింది. 

లతకు స్టోరీ మొత్తం చెప్పిన భలేష్..
అయితే, ప్రేమ్ కుమార్, మీనాల లవ్ ఎఫైర్ గురించి మొత్తం తెలిసిన భలేష్ కుమార్.. ఆమె సమస్యకు పరిష్కారం చెప్పలేకపోయాడు కానీ.. ఆమె సమస్యకు అసలు కారణం ఏంటో పూసగుచ్చినట్టు చెప్పేశాడు. నీ భర్త ప్రేమ్.. మీనా అనే మరో వివాహితతో లవ్ ఎఫైర్‌లో ఉన్నాడంటూ వివరించాడు. 

తన భర్త ప్రేమ్ తనతో తరచుగా గొడవ పడటానికి అసలు కారణం ఏంటో తెలుసుకున్న లత అతడిని నిలదీయకుండా ఉండలేకపోయింది. దీంతో తమ గురించి మొత్తం తెలిసిన భూతవైద్యుడు భలేష్ తమని బుక్ చేశాడని అర్థం చేసుకున్న ప్రేమ్ కుమార్, మీనా అతడిని తీవ్రంగా బెదిరించారు. లైంగిక వేధింపుల కేసు పెట్టి నీ పరువు తీస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏం చేయాలో పాలుపోని భూతవైద్యుడు భలేష్.. ఆ ఇద్దరూ తనపై ప్రతీకారం తీర్చుకోకముందే.. తానే వారిని అంతమొందించాలని స్కెచ్ వేశానని పోలీసులకు వివరించాడు.

50 ట్యూబుల ఫెవిక్విక్‌తో స్కెచ్ వేసిన భలేష్
ప్రేమ్ కుమార్, మీనాలతో మాట్లాడాల్సి ఉందని నమ్మించి వారిని సమీపంలోని అడవిలో ఒక నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. అదే ప్రదేశంలో వారితో మాట్లాడిన తరువాత తాను అక్కడి నుంచి తిరిగి  వెళ్లిపోయిన్టటుగా వారిని నమ్మించాడు. భలేష్ వెళ్లిపోయాడని నమ్మిన ప్రేమ్, మీనా ఇద్దరూ ఇక అక్కడ మూడో మనిషి ఎవ్వరూ లేరని భావించి రాసక్రీడలో మునిగిపోయారు. వాళ్లిద్దరి కదలికలను దూరంగా ఉండి ఓ కంట కనిపెడుతున్న భలేష్.. అదును చూసుకుని సీన్‌లోకి ఎంటరయ్యాడు. 

అంతకంటే ముందుగానే 50 ఫెవిక్విక్ ట్యూబులు కొనుగోలు చేసి అందులోని గ్లూ మొత్తాన్ని ఒక బాటిల్లో నింపి పెట్టాడు. గ్లూ నింపిన ఆ బాటిల్‌ని తన వెంట తెచ్చుకున్న భలేష్.. నగ్నంగా శృంగారంలో మునిగి తేలుతున్న ప్రేమ్, మీనాల ప్రైవేట్ పార్ట్స్‌పై కుమ్మరించాడు. ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాకైన ప్రేమ్, మీనాలు ఇద్దరూ ఒకరికొకరు దూరం జరిగేందుకు ప్రయత్నించగా.. ఆ ఫెవిక్విక్ గమ్ వారి శరీరాలను చిద్రం చేయడం మొదలుపెట్టింది. దీంతో ప్రైవేట్ పార్ట్స్‌లో కోసినట్టుగా గాయాలయ్యాయి. ఆ గాయల మంటతో ఆ ఇద్దరూ ప్రత్యక్ష నరకం అనుభవిస్తుండగానే భలేష్ ఈసారి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన రెండో ప్లాన్‌ని అమలు చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రేమ్ గొంతు కోసి చంపేశాడు. మీనాను పొడిచి చంపేసి అక్కడి నుంచి ఏమీ తెలియనట్టే వెళ్లిపోయాడు. కానీ సీసీటీవీ కెమెరాల నుంచి తప్పించుకోలేకపోయాడు. 

ఆ ఇద్దరి బలహీనతపై దెబ్బ కొట్టిన భలేష్..
భలేష్ తమని ట్రాప్ చేస్తున్నాడనే విషయాన్ని కామంతో కళ్లు మూసుకుపోయిన ప్రేమ్, మీనాలు ఇద్దరూ గ్రహించలేకపోయారు. కానీ వాళ్ల బలహీనత ఏంటో తెలిసిన భలేష్ మాత్రం తెలివిగా వారిని తను అనుకున్న చోటికే రప్పించి మరీ మర్డర్ చేశాడు. తనే రాసుకుని, తనే ఇంప్లిమెంట్ చేసిన స్క్రిప్టు మొత్తాన్ని పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో పూసగుచ్చినట్టుగా చెప్పి తన నేరాన్ని అంగీకరించాడు. వివాహేతర సంబంధం రెండు నిండు జీవితాలను ఎలా అంతం చేసిందో.. గౌరవంగా బతుకుతున్న రెండు కుటుంబాలను ఎలా రోడ్డున పడేసిందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి సమీపంలోని గోగుండ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

Read More