Home> జాతీయం
Advertisement

Coronavirus update: ఆస్పత్రి నుంచి ఐదుగురు కరోనావైరస్ అనుమానితుల పరారీ

ఐదుగురు అనుమానితులు పరారైనట్టు తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు సీసీటీవీ కెమెరాల ఆధారంగా వారి ఆచూకీని గుర్తించిన పోలీసులు.. వారిని తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Coronavirus update: ఆస్పత్రి నుంచి ఐదుగురు కరోనావైరస్ అనుమానితుల పరారీ

నాగపూర్ : కరోనావైరస్ సోకినట్టుగా అనుమానిస్తున్న ఐదుగురు రోగులు (Suspected coronavirus patients) ఆస్పత్రి నుంచి పరారైన ఘటన శుక్రవారం రాత్రి నాగ్‌‌పూర్‌లో చోటుచేసుకుంది. మయో ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకున్న ఐదుగురిలో ఒకతనికి ఇప్పటికే కోవిడ్-29 నెగటివ్ అని తేలినప్పటికీ.. మిగతా నలుగురి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఐదుగురు అనుమానితులు పరారైనట్టు తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు సీసీటీవీ కెమెరాల ఆధారంగా వారి ఆచూకీని గుర్తించిన పోలీసులు.. వారిని తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు నాగపూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ సూర్యవంశి మీడియాకు వివరాలు వెల్లడించారు. 

ఆస్పత్రికి వెళ్లి విచారించగా... ఆ ఐదుగురు అనుమానితులు తినుబండారాల కోసమని వెళ్లి.. ఇక హాస్పిటల్‌కి తిరిగి రాలేదని తెలిసిందని ఎస్సై సూర్యవంశి తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More