Home> జాతీయం
Advertisement

ఎంపీపై కేసు పెట్టిన కూరగాయల వ్యాపారి

బీజేపీ ఎంపీ కిరిత్ సోమియాపై ఓ కూరగాయల వ్యాపారి కేసు పెట్టాడు.

ఎంపీపై కేసు పెట్టిన కూరగాయల వ్యాపారి

బీజేపీ ఎంపీ కిరిత్ సోమియాపై ఓ కూరగాయల వ్యాపారి కేసు పెట్టాడు. తనపై ఆ ఎంపీ చేయి చేసుకున్నట్లు, పైగా తన వద్ద డబ్బులు కూడా తీసుకున్నట్లు ఆ వ్యాపారి ఆరోపిస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే.. ముంబాయిలో కూరగాయలు అమ్ముకుంటున్న వ్యాపారి వద్దకు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో బీజేపీ ఎంపీ కిరిత్ సోమియా వెళ్లాడు. ఈ ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేయాలని వ్యాపారిని హెచ్చరించి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత మళ్లీ వచ్చిన ఆ నేత కూరగాయల వ్యాపారి మీద ఆగ్రహం వ్యక్తం చేసి.. ఇంకా ఎందుకు ఖాళీ చేయలేదని వారించాడు. ఖాళీ చేస్తున్నామని చెబుతున్నా.. అదేమీ వినిపించుకోకుండా కిరిత్ తనపై చేయి చేసుకున్నట్లు ఆ కూరగాయల వ్యాపారి ఆరోపించాడు. అక్కడితో ఆకుండా కూరగాయలు కొంటున్న మహిళా బ్యాగును తోసేశారని, తన వద్ద రూ. 1250 జరిమానా కట్టించుకున్నట్లు వ్యాపారి అన్నాడు. ఎంపీ అమర్యాదగా ప్రవర్తించాడని కూరగాయల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

Read More