Home> జాతీయం
Advertisement

Karnataka Accident: కర్ణాటకలో నెత్తురోడిన రోడ్డు..ఐదుగురు దుర్మరణం, పలువురికి గాయాలు..!

Karnataka Accident: కర్ణాటకలో మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Karnataka Accident: కర్ణాటకలో నెత్తురోడిన రోడ్డు..ఐదుగురు దుర్మరణం, పలువురికి గాయాలు..!

Karnataka Accident: కర్ణాటక బీదర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్‌లో మృత్యుఒడికి చేరారు. ఇందులో ఓ చిన్నారి సైతం ఉంది. బంగూర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. దేవుడి దర్శనం చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

మృతులు హైదరాబాద్‌కు చెందిన గిరిధర్(45), ప్రియ(15), అనిత(30), మహేష్‌(2), డ్రైవర్ జగదీష్‌(35) గుర్తించారు. గిరిధర్ పోలీస్‌ విభాగంలో పని చేస్తున్నట్లు గుర్తించారు. కలబురగి జిల్లా గంగాపూర్‌కు చెందిన దత్తాత్రేయను దర్శించుకున్నారు. అనంతరం ఒకే కుటుంబానికి చెందిన 10 మంది కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. బీదర్ తాలుకా బంగూర్‌ సమీపంలో జాతీయ రహదారిపై దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదస్థలిని పోలీసులు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

fallbacks

Also read:AP Rajbhavan: ఏపీ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం..దూరం దూరంగా జగన్, చంద్రబాబు..!

Also read:Telangana Rajbhavan: రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య దూరం పెరిగిందా..తేనీటి విందుకు రాని సీఎం కేసీఆర్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More