Home> జాతీయం
Advertisement

Rajasthan Congress MLAs: జైపూర్ నుంచి జైసల్మేర్‌కు రాజస్థాన్ హైడ్రామా

Rajasthan Congress MLAs | రాజస్థాన్ రాజకీయ హైడ్రామా మరో మూడు వారాల్లో ఓ కొలిక్కి రానుంది. అప్పటివరకూ తన వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Rajasthan Congress MLAs: జైపూర్ నుంచి జైసల్మేర్‌కు రాజస్థాన్ హైడ్రామా

జైపూర్‌ : రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాద్ మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మకాం మారుతోంది. గత మూడు వారాలుగా జైపూర్‌లోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో అంత్యాక్షరి, సినిమాలు, ఇతర గేమ్స్‌తో కాలక్షేపం చేసిన గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలను జైసల్మేర్‌కు తరలిస్తున్నారు. AP: శానిటైజర్‌ తాగి 9 మంది మృతి

ముందుగా జైపూర్ ఫెయిర్‌మాంట్ హోటల్ నుంచి ఎమ్మెల్యేలు బస్సులలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి జైసల్మేర్ తరలించాలని సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ అధిష్టానం భావించింది. మరోవైపు ఆగస్టు 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ మొదలైతే బల పరీక్ష జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆయన వల్లే మా ఫ్యామిలీ ఈరోజు.. అల్లు అర్జున్ భావోద్వేగం

తమ వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే సచిన్ పైలట్ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలను సైతం తమ దారిలోకి తెచ్చుకునేందుకు అశోక్ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 17న బల నిరూపణకు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ మద్దతుతోనే సచిన్ పైలట్ తిరుగుబావుటా ఎగురవేశారని ఇటీవల సీఎం గెహ్లాట్ ఆరోపించారు.   వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

 

Read More