Home> జాతీయం
Advertisement

Pregnant With Twins: దిగ్భ్రాంతి కరఘటన.. కవలలతో ఉన్న గర్భవతిని సజీవ దహానం చేసిన భర్త.. మహిళా కమిషన్ సీరియస్..

Pregnant With Twins:పంజాబ్ లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. గత శుక్రవారం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత ఆ వ్యక్తి కోపంలో తన భార్య పింకీని మంచానికి కట్టేసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది.
 

Pregnant With Twins: దిగ్భ్రాంతి కరఘటన.. కవలలతో ఉన్న గర్భవతిని సజీవ దహానం చేసిన భర్త.. మహిళా కమిషన్ సీరియస్..

Amritsar Woman Pregnat With Twins Sets Her On Fire: కొందరు భర్తలు సైకోలుగా ప్రవర్తిస్తుంటారు. తమ వాళ్లను అందరిని వదిలేసి వచ్చిన భార్యపట్లు పైశాచికంగా ప్రవర్తిస్తుంటారు. కట్నంతేలేదని, నల్లగా ఉందని కొందరు వేధిస్తుంటారు. మరికొందరు కూరలో ఉప్పు వేయలేదని, చికెన్ వండటానికి రాలేదంటూ హింసలు పెడుతుంటారు. ఇక మరికొందరైతే భార్య ఎక్కడికి వెళ్లిన ఎవరితో మాట్లాడిన కూడా అనుమానంతోనే ఉంటారు. ఎల్లప్పుడు భార్య కదలికలపై అనుమానంతో, నిరంతరం వేధిస్తుంటారు. లేచిన తప్పే.. కూర్చున్న తప్పే.. ఒక మంచి చీర కట్టుకున్న ఎవరికోసం అన్నట్లు సూటిపోటీ మాటలతో వేధిస్తుంటారు. పుట్టింటికి వెళ్లడానికి కూడా అవకాశం ఇవ్వరు. ఇంట్లో వాళ్లతో ఫోన్ లో మాట్లాడాలన్న.. తమ ముందే మాట్లాడాలి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో భార్య ఏది చేసిన భర్తలను నచ్చదు.

Read More: Principal Facial In Classroom: స్కూల్ లో అమ్మాయిలతో ఫెషియల్ చేయించుకున్న ప్రిన్స్ పాల్.. వైరల్ వీడియో..

కొందరు పెళ్లి చేసుకొనేటప్పుడు బాగానే ఉండి. ఆ తర్వాత తమ అసలు రంగును బైటపెడుతుంటారు. తమకు కట్నం బాగా వచ్చేదని, నీ వల్ల సుఖం లేదని, ఒక వేళ కూతురు పుడితే ఆ రకమైన వేధింపులు మరో లెవల్.. ఇలా ప్రతినిముషం కూడా ఇబ్బందులు పెడుతుంటారు. కొందరైతే.. తమ భార్యలను మానసికంగా, శారీరంగా హింసిస్తుంటారు. చివరకు చంపడానికి సైతంవెనుకాడరు.ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు..

పంజాబ్ లోని అమృత్‌సర్‌ లో కన్నీళ్లు తెప్పించే ఘటన చోటు చేసుకుంది. సుఖ్ దేవ్ పింకీలు దంపతులు. వీరు బుల్లెనంగల్ గ్రామంలో ఉంటున్నారు. అయితే.. సుఖ్ దేవ్ పెళ్లైనప్పటి నుంచి భార్యను వేధింపులకు గురిచేసేవాడు. అంతేకాకుండా.. ప్రతిరోజు ఏదో ఒక వంకతో భార్యను వేధించేవాడు. అయితే.. పింకీ ఇదంతా భరిస్తు వచ్చింది. ఈక్రమంలో పింకీ ఆరునెలల నిండు గర్భిణి. శుక్రవారం రోజు కూడా దంపతుల మధ్య గొడవలు పీక్స్ కు చేరాయి. దీంతో సుఖ్ దేవ్ ఆవేశంలో తనభార్యను.. ప్రెగ్నెంట్ ఉందని కూడా కనికరం చూపలేదు. ఆమెను మంచానికి కట్టేసి, కిరోసిన్ పోసి నిప్పండించాడు. ఒక్కసారిగా ఇల్లంతా మంటలు వ్యాపించడంతో అతను పారిపోయాడు. మంచానికి కట్టేయడం వల్ల ఆమె ఎటుకదల్లేక అలాగే అగ్నికి ఆహుతిలా మారిపోయింది. ఆమె కడుపులో ఉన్న ఇద్దరు కవలలు కూడా బైటకు రాకుండానే అగ్నికి ఆహుతిలా మారిపోయారు.

Read More: Gwalior Girl Marries Lord Krishna: శ్రీ కృష్ణ పరమాత్ముడిని పెళ్లాడిన యువతి... జీవితమంతా బృందావనంలోనే..?

వెంటనే చుట్టుపక్కల ఉన్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది. ప్రెగ్నెంట్ మహిళ అగ్నికి కాలిపోయి, ఎముకలు మాత్రమే మిగిలిపోయాయి. ఈ ఘటన పంజాబ్ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ (NCW) కూడా స్పందించింది. "అమృత్‌సర్‌లో ఓ వ్యక్తి తన గర్భిణి భార్యను నిప్పంటించిన భయానక సంఘటనతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు రేఖా శర్మ తెలిపింది. ఈ చర్య యొక్క క్రూరత్వం ఊహించలేనిదంటూ వ్యాఖ్యలు చేసింది. వెంటనే ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కూడా పంజాబ్ డీజీపీని ఆదేశించింది. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని కూడా ఆదేశించింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More