Home> జాతీయం
Advertisement

PM Narndra Modi Nomination:నేడు వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..

PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్న సంగతిత తెలిసిందే. ఈ రోజు 7వ విడత నామినేషన్స్ కు చివరి రోజు కావడంతో భారీ రోడ్డు షోతో ప్రధాన మంత్రి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

PM Narndra Modi Nomination:నేడు వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..

PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల తీరిక లేకుండా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 18వ లోక్ సభకు ఎన్నికల 7 విడతల్లో ఎన్నికలు జరగున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల్లో 379 లోక్ సభ సీట్లకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మరో మూడు విడతల్లో 164 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి  పోటీ చేస్తోన్న వారణాసి సహా 57 లోక్ సభ నియోజకవర్గాలకు జూన్ 1న పోలింగ్ జరనుంది. ఈ రోజు వారణాసి లోక్ సభ స్థానానికి ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఇప్పటికే మోడీ ఎన్నికల నామినేషన్‌కు సంబంధించిన వారణాసిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.  ఇప్పటికే ఆయన రెండు సార్లు  దేశంలో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన వారణాసి నియోజవర్గం నుంచి భారీ మెజారిటీలో లోక్ సభలో అడుగుపెట్టారు. నిన్ననే వారణాసి చేరుకొని హిందూ బెనరాస్ విశ్వవిద్యాలయ వ్యవస్థపకుడు భారతరత్న మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూల మాల వేసి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ రోజు నామినేషన్‌ దాఖలకు ముందు ఆయన కొన్ని కిలో మీటర్ల మేర వారణాసిలో రోడ్ షో నిర్వహించనున్నారు. అంతకు ముందు వారణాసిలో పలు పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీయే నేతలు భారీగా హాజరు కానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

Also read: AP Poll Percentage: ఏపీలో అర్ధరాత్రి వరకూ 78 శాతం దాటిన పోలింగ్, ఏ జిల్లాలో ఎంత, ఎవరికి అనుకూలం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధాన మంత్రిగా తొలిసారిగా లోక్ సభ పోటీ చేసి గెలిచారు. ఇక 2019లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి రెండోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2024లో ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధిస్తే.. మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ఒకవేళ మూడోసారి నరేంద్ర మోదీ  పీఎం అయితే.. కాంగ్రెస్ యేతర తొలి ప్రధాన మంత్రిగా పలు రికార్డులు ప్రధాన మంత్రి మోదీ క్రియేట్ చేయనున్నారు.  

ఏడు విడతల ఎన్నికల తర్వాత జూన్ 4న 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. అందులో ఎక్కువ సీట్లు ఎవరు గెలిస్తే వారే తదుపరి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటికే పలు సర్వే ఏజెన్సీలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి.

ఇక్క కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ అజయ్ రాయ్‌ను పోటీ చేస్తున్నాడు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో మోదీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదే విధంగా రాజస్తాన్‌కు చెందిన కమెడియన్ శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు.

Read More