Home> జాతీయం
Advertisement

దేశం ఓ మహా నేతను కోల్పోయింది : ప్రధాని నరేంద్ర మోదీ

కరుణానిధి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం 

దేశం ఓ మహా నేతను కోల్పోయింది : ప్రధాని నరేంద్ర మోదీ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. కళైగర్ కరుణానిధి మృతితో దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని మోదీ ట్వీట్ చేశారు. తమిళుల కోసం, తమిళనాడు కోసం కరుణానిధి చేసిన సేవలను కొనియాడుతూ పలు ట్వీట్స్ చేసిన మోదీ.. అనేక సందర్భాల్లో తనకు కరుణానిధి గారిని కలుసుకుని, ఆయనతో మాట్లాడే అవకాశం లభించింది అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా పలు సందర్భాల్లో ఆయన కరుణానిధిని కలిసినప్పటి ఫోటోలను ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో షేర్ చేసుకుని కళైగర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

 

Read More