Home> జాతీయం
Advertisement

2017 ఏడాదికి గానూ చివరి 'మన్ కీ బాత్' నేడే

డిసెంబర్ 31, ఆదివారం నాటి 'మన్ కీ బాత్' కి ఒక ప్రత్యేకత ఉంది. ఇదే 2017 ఏడాదికిగానూ చివరి 'మన్ కీ బాత్'.

2017 ఏడాదికి గానూ చివరి 'మన్ కీ బాత్' నేడే

న్యూఢిల్లీ: డిసెంబర్ 31, ఆదివారం నాటి 'మన్ కీ బాత్' కి ఒక ప్రత్యేకత ఉంది. ఇదే 2017 ఏడాదికిగానూ చివరి 'మన్ కీ బాత్'. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ చివరి ప్రసంగంలో ప్రసంగించనున్నారు.

ఈ 39వ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం ఎడిషన్ ప్రధాన మంత్రి కార్యాలయం, సమాచార, బ్రాడ్కాస్టింగ్ మరియు డీడీ న్యూస్ యొక్క యూట్యూబ్ ఛానెళ్లలో ప్రసారం చేయబడుతుంది. ఈ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో (AIR), దూరదర్శన్, నరేంద్రమోదీ మొబైల్ అప్లికేషన్లలలో ప్రసారమవుతుంది. 1922కి మిస్డ్ కాల్ ఇచ్చి, మీ మొబైల్ ఫోన్ లో ఈ కార్యక్రమాన్ని వినవచ్చు.

తన మునుపటి 'మన్ కీ బాత్' లో, ప్రధాని ఉగ్రవాదం ప్రపంచ ముప్పును ఎలా ఎదుర్కోవచ్చని చెప్పారు. యూరియా వాడకాన్ని తగ్గించాలని రైతులను కోరారు. 

 

ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో, డీడీ నేషనల్ మరియు డీడీ న్యూస్లో ప్రసారమవుతుంది. ప్రధాని మోదీ రేడియో కార్యక్రమాన్ని 2017 ట్విట్టర్లో న్యూస్ & గవర్నెన్స్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాష్ టాగ్ గా ప్రకటించారు.

డిసెంబర్ 31న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేరళలోని శివగిరి మట్ వద్ద 85వ శివగిరి తీర్థయాత్ర వేడుకల కోసం ప్రధాని ప్రసంగిస్తారు. జనవరి 1 సోమవారం కోల్కతాలో ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ 125వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు.

Read More